Finland: ఫిన్లాండ్ ప్రధానికి డ్రగ్స్ టెస్ట్...ఫలితం ఏం తేలిందంటే..!
మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నందుకు గానూ ఫిన్లాండ్(Finland) ప్రధాని సనా మారిన్(Sanna Marin) వివాదంలో చిక్కుకున్నారు.
హెల్సింకి: మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నందుకు గానూ ఫిన్లాండ్(Finland) ప్రధాని సనా మారిన్(Sanna Marin) వివాదంలో చిక్కుకున్నారు. విపక్షాల విమర్శలతో ఆమె డ్రగ్స్ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. కాగా, ఇప్పుడు ఆ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి.
పార్టీ వీడియో వైరల్ కావడంతో అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు మారిన్ డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. ఆమె మూత్రం నమూనాలను పరీక్షించగా.. నెగెటివ్గా తేలింది. ‘ప్రధాని సనా మారిన్ నుంచి ఆగస్టు 19, 2022న నమూనాలు సేకరించాం. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. నిబంధనలకు అనుగుణంగానే ఈ పరీక్ష జరిగింది’ అని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల మారిన్తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్సులు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో నేలపై మోకాళ్ల మీద కూర్చొని ఆమె ఓ పాటకు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ విమర్శలను ఇదివరకే మారిన్ తోసిపుచ్చి, విచారం వ్యక్తం చేశారు. ‘ఓ సాయంత్రం వేళ.. మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ సందర్భంగా డ్యాన్సులు, పాటలు పాడటం వాస్తవమే. ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్ కావడం దురదృష్టకరం. కేవలం ఆల్కహాల్ తప్ప ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. నా జీవితంలో ఎన్నడూ నేను వాటిని వాడలేదు. మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే. మేం ఏ తప్పూ చేయలేదు’ అంటూ వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా