America: న్యూయార్క్‌లో ఘోర అగ్నిప్రమాదం: 19 మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది మృతిచెందారు.

Updated : 10 Jan 2022 04:49 IST

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది మృతిచెందారు. మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నారు. సుమారు 60 మంది గాయపడ్డట్లు సమాచారం. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. 19 అంతస్తులున్న అపార్ట్‌మెంట్‌లో రెండు, మూడు అంతస్తులకు మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో మొత్తం పొగచూరింది. చాలామంది పోగపీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలు చెలరేగగానే 200 మంది ఫైరింజన్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గత కొన్నేళ్లలో న్యూయార్క్‌ మహానగరంలో ఇలాంటి సంఘటన చూడనట్లు మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ తెలిపారు. అమెరికా చరిత్రలో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇదొకటిగా మిగిలిపోతుందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని