France:12ఏళ్లలో తొలిసారి ఫ్రాన్స్లో ప్రభుత్వ వ్యతిరేక సమ్మె.. రేపు రైళ్లు, విమాన సర్వీసులకు ఆటంకం
ఫ్రాన్స్లో రేపు భారీ సమ్మె జరగనుంది. అక్కడ రైళ్లు, విమాన సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. గత 12 ఏళ్లలో ఈ స్థాయి సమ్మెను ఆదేశం చూడలేదు.
ఇంటర్నెట్డెస్క్: ఫ్రాన్స్(France)లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన తీవ్రమైంది. అక్కడ రిటైర్మెంట్ వయస్సు పెంపును నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇక్కడ రిటైర్మెంట్ వయస్సును 62 నుంచి 64కు పెంచాలని ప్రతిపాదించింది. దీనిపై ఆ దేశ పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. దీంతోపాటు పింఛను పొందేందుకు చెల్లించాల్సిన వాటాను కూడా పెంచడాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే పలు సంస్థలు ప్రజాభిప్రాయ సేకరణ చేశాయి. మూడింట రెండొంతుల మంది ఫ్రాన్స్(France) పౌరులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. ఈ ప్రతిపాదనలపై నిరసనగా గురువారం సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆ దేశంలో 12 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ స్థాయిలో సమ్మె నిర్వహిస్తున్నాయి. గతంలో కూడా రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62కు పెంచినప్పుడు ఇదే విధంగా చేశాయి. పింఛను చందాను కచ్చితంగా 43 ఏళ్లు చెల్లించాలనే ప్రతిపాదనను కూడా 2027 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సమ్మెను దృష్టిలోపెట్టుకొని గురువారం ఆ దేశంలో పెద్ద ఎత్తున విమానాలు రద్దుకానున్నాయి. ఇప్పటికే పారిస్ సబ్వేపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. అత్యంత కఠినమైన గురువారంగా ఆ దేశ రవాణశాఖ మంత్రి క్లెమెంట్ బ్యూని అభివర్ణించారు. సమ్మె ప్రభావంతో చాలా వరకు హైస్పీడ్ టీజీవీ లైన్లు మూతపడనున్నాయి. కేవలం పదోవంతు స్థానిక రైళ్లు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిస్ నగరంలో ఆర్ఈఆర్ రైళ్లు, మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రతి ఐదు విమాన సేవల్లో కనీస ఒకటి నిలిచిపోతుందని ప్రభుత్వ వర్గాలు అంచనావేశాయి. టీచర్లలో 70శాతం మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఐరోపాలో ఉదారంగా ఉండే పింఛను వ్యవస్థల్లో ఫ్రాన్స్(France)ది కూడా ఒకటి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు తరచూ దీనిని మార్చేందుకు యత్నిస్తుంటాయి. ప్రజలు ఆందోళనలు చేపట్టి ఆ వ్యవస్థను కాపాడుకొంటూ వస్తున్నారు. 1995లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్