Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపనని పుతిన్ తనకు మాట ఇచ్చినట్లు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తాజాగా వెల్లడించారు. యుద్ధం మొదట్లో బెన్నెట్.. ఉక్రెయిన్, రష్యాల మధ్య కొంతకాలం మధ్యవర్తిత్వం వహించారు.
టెల్ అవీవ్: ఉక్రెయిన్(Ukraine)పై సైనిక చర్య ప్రారంభంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky)ని హతమార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ పనికి ఒడిగట్టనని రష్యా(Russia) అధినేత పుతిన్(Putin) తనకు మాట ఇచ్చినట్లు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభం మొదట్లో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు బెన్నెట్(Naftali Bennett) సైతం కొంతకాలం మధ్యవర్తిత్వం వహించారు. అయితే, అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
‘గతేడాది మార్చిలో మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్తో సమావేశమయ్యా. ఈ క్రమంలోనే.. జెలెన్స్కీని చంపాలనుకుంటున్నారా? అని ఆయన్ను అడిగా. ‘లేదు’ అని పుతిన్ సమాధానం ఇచ్చారు. దీన్నొక వాగ్దానంగా భావిస్తున్నట్లు ఆయనతో చెప్పా. ‘జెలెన్స్కీని చంపబోన’ని పుతిన్ పునరుద్ఘాటించారు. అనంతరం ఇదే విషయాన్ని జెలెన్స్కీకి చెప్పా. ‘నేను పుతిన్తో సమావేశమై బయటకు వచ్చా. ఆయన నిన్ను హత్య చేయడు’ అని తెలిపా. దానికి జెలెన్స్కీ ‘కచ్చితమేనా?’ అని అడిగారు. వంద శాతం అని బదులిచ్చా' అని బెన్నెట్ అప్పటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు.
తాను మధ్యవర్తిత్వం వహించిన సమయంలో ఉక్రెయిన్ నిరాయుధీకరణ ప్రతిజ్ఞను పుతిన్ విరమించుకున్నట్లు బెన్నెట్ తెలిపారు. అదేవిధంగా నాటోలో చేరబోనని జెలెన్స్కీ సైతం వాగ్దానం చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. నఫ్తాలీ బెన్నెట్ జూన్ 2021 నుంచి జూన్ 2022 వరకు ఇజ్రాయెల్ ప్రధానిగా పనిచేశారు. మరోవైపు.. ఇరాన్తో వివాదం నేపథ్యంలో రష్యాతో ఇజ్రాయెల్ మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. అయితే, ఉక్రెయిన్ విషయంలో అది పాశ్చాత్య దేశాలతో జట్టుకట్టింది. కీవ్కు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!