కారడవుల్లో అద్భుతం.. విమాన ప్రమాదం జరిగిన 17 రోజులకు సజీవంగా చిన్నారులు
విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత అద్భుతం చోటుచేసుకుంది. 11 నెలల పసిబిడ్డతో సహా నలుగురు చిన్నారులు దట్టమైన అడవి(Amazon rainforest)లో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
బొగొట్(కొలంబియా): దట్టమైన అటవీప్రాంతంలో 17 రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు చిన్నారులు బతికిబయటపడ్డారు. వారిలో 11 నెలల పసిబిడ్డ కూడా ఉంది. ఇన్నిరోజుల తర్వాత వారిని సజీవంగా గుర్తించడంతో కొలంబియా (Colombia)లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశ పరిధిలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో(Amazon rainforest) వీరిని గుర్తించారు. దేశానికి ఇది సంతోషకరమైన రోజని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు. కఠిన ప్రయాసలతో కూడిన గాలింపు చర్యల అనంతరం వారిని గుర్తించినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.
అమెజాన్ అటవీ ప్రాంతం(Amazon rainforest) పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటిన విమానం బయలుదేరింది. అందులో పైలట్, ఆరుగురు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు.‘ఆపరేషన్ హోప్’ పేరిట దట్టమైన అడవుల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో పైలట్, మరో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు.
అయితే విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వారు అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలిసింది. వారు క్షేమంగా ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. ఎటువెళ్లాలో తెలీక వారు అక్కడక్కడే తిరుగుతున్నట్లు గుర్తించారు. దాంతో గాలింపును మరింత తీవ్రం చేయగా.. వారి జాడ లభ్యమైంది. ప్రస్తుతం వారిని సురక్షితంగా కాపాడారు.
అయితే వారు అడవిలో అన్ని రోజులు ఎలా సురక్షితంగా ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టతలేదు. అలాగే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. మరణించినవారిలో చిన్నారుల తల్లి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో రహదారి ప్రయాణం కష్టం కావడంతో విమాన రాకపోకలు సర్వసాధారణంగా కనిపిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.