Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన నాలుగేళ్ల చిన్నారి సయీద్ రషీద్ రికార్డు సృష్టించాడు. పుస్తకాన్ని రచించిన అతిపిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు.
ఇంటర్నెట్డెస్క్: రికార్డులు సృష్టించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు ఓ బుడతడు. నాలుగేళ్ల వయస్సులోనే పుస్తకం రాసి గిన్నిస్ రికార్డు (Guinness World Records) నెలకొల్పాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన సయీద్ రషీద్ అల్మెహెరి (Saeed Rashed) అనే బాలుడు పుస్తకాన్ని రచించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రికార్డు నెల కొల్పిన నాటికి ఆ చిచ్చరపిడుగు వయస్సు 4 ఏళ్ల 218 రోజులు అని గిన్నిస్ బుక్ ప్రతినిధులు వెల్లడించారు. రెండు జంతువుల మధ్య స్నేహాన్ని ప్రధాన అంశంగా తీసుకొని సయీద్ రాసిన ‘ ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్’ (The Elephant Saeed and the Bear) అనే పుస్తకం యూఏఈలో ఆదరణ పొందుతోంది. మార్చి 9 నాటికి 1000 కాపీలు అమ్ముడుపోవడంతో సయీద్ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ధ్రువీకరించారు.
కేవలం సయీద్ మాత్రమే కాదు.. అతడి అక్క కూడా గతంలో రికార్డు నెలకొల్పిందట. ఎనిమిదేళ్ల అల్ధాబి ఒకే పుస్తకాన్ని రెండు భాషల్లో రాసిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. సయీద్ పుస్తకం రాయడానికి ఆమే ప్రేరణ కల్పించిందట. అంతేకాకుండా అల్ధాబి స్థానికంగా రెయిన్బో చిమ్నీ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ పేరిట ఓ ప్రచురణా కేంద్రాన్ని కూడా నడిపిస్తోంది. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన సందర్భంగా సయీద్ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ మా అక్క అంటే నాకెంతో ఇష్టం. ఆమెతో ఆడుకోవడం అంటే నాకెంతో సరదా. ఇద్దరం కలిసి చదువుకుంటాం, రాసుకుంటాం, ఏ పని చేయాలన్నా ఇద్దరం కలిసే చేస్తాం. నేను పుస్తకం రాయడానికి ఆమే స్ఫూర్తి’’ అని చెప్పుకొచ్చాడు. గిన్నిస్ రికార్డు సృష్టించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.