United Nations: స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏళ్లు!
ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే.. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏళ్లు పడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. అఫ్గానిస్థాన్లో మహిళలు, బాలికలను ప్రజాజీవితానికే దూరం చేసిన పరిస్థితులను ప్రస్తావించారు.
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు(Women Rights) తీవ్ర ఉల్లంఘనలకు, దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఐరాస(United Nations) ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే ధోరణి కొనసాగితే.. స్త్రీ, పురుష సమానత్వ(Gender Equality) సాధనకు మరో 300 ఏళ్లు పడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్(Antonio Guterres) హెచ్చరించారు. స్త్రీ, పురుష సమానత్వ సాధనకు పనిచేస్తోన్న ‘మహిళల స్థితిగతులపై ఐరాస కమిషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గుటెరస్ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు.
‘ఉక్రెయిన్ నుంచి సాహెల్ ప్రాంతం(ఆఫ్రికా) వరకు సంక్షోభాలు, సంఘర్షణల ప్రభావం.. మొదట మహిళలు, బాలికలపైనే పడింది. పితృస్వామ్య పోకడలు మళ్లీ జడలు విప్పుతోన్న నేపథ్యంలో.. దశాబ్దాలుగా సాధించిన పురోగతి కనుమరుగవుతోంది. అఫ్గానిస్థాన్లో మహిళలు, బాలికలను ప్రజాజీవితానికి దూరం చేశారు. అనేక దేశాల్లో మహిళల లైంగిక, సంతానోత్పత్తి హక్కులనూ లాగేసుకుంటున్నారు. కొన్ని చోట్ల బాలికలకు కిడ్నాప్, వేధింపుల ముప్పు పొంచి ఉంది. మాతాశిశు మరణాలు పెరుగుతున్నాయి. కొవిడ్ ప్రభావంతో.. వారి విద్యా, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి’ అని గుటెరస్ వ్యాఖ్యానించారు.
‘సాంకేతికత వినియోగంలోనూ మహిళలు వెనకే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ఇప్పటికీ ఇంటర్నెట్కు దూరంగా ఉంటే.. వారిలో అధిక శాతం మహిళలే. అభివృద్ధి చెందుతోన్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 19 శాతం మంది మహిళలు ఆన్లైన్ వినియోగిస్తున్నారు’ అని గుటెరస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతికత, ఇంజినీరింగ్, గణిత రంగాల్లో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపారు. కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే.. స్త్రీ, పురుషుల మధ్య అధికార అంతరాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. బాలికలు, మహిళలకు విద్య, ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. వారికి సురక్షిత డిజిటల్ వాతావరణాన్ని అందించాలన్నారు. మరోవైపు.. డిజిటల్ వివక్ష అనేది స్త్రీ, పురుష అసమానతలకు కొత్త ముఖంగా మారిందని ఐరాస మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ వ్యాఖ్యానించారు. 2022లో మహిళల కంటే పురుషులు 25.9 కోట్ల మంది ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించినట్లు చెప్పారు. మహిళలకు నెట్టింట వేధింపులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. సాంకేతికత, ఆవిష్కరణల్లో స్త్రీ, పురుష అంతరాలను తగ్గించడంపై ఐరాస కమిషన్ ఈసారి ప్రధానంగా దృష్టి సారించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM