అలారం హెచ్చరించినా..అగ్ని ప్రమాదాన్ని పసిగట్టని అపార్ట్మెంట్ వాసులు
అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్లో ఆదివారం అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 19 మంది మరణించిన నేపథ్యంలో..
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్లో ఆదివారం అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 19 మంది మరణించిన నేపథ్యంలో.. హెచ్చరిక అలారాల పాత్రపై చర్చ మొదలైంది. వాస్తవానికి ప్రమాదం సంభవించిన వెంటనే భవనంలోని అలారాలు మోగినా పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో అవి పదేపదే మోగుతుండడంతో బహుశా అలాగే మోగి ఉంటాయని భావించినట్లు సమాచారం. ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘భవనంలోని అలారాలు ఇటీవల తరచూ మోగేవి. అందువల్లే ఆదివారం అలారం మోగినా పెద్దగా పట్టించుకోలేదు’’ అని ఆయన చెప్పారు. మరోవైపు, నాలుగు రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించగా, ఎనిమిది మంది చిన్నారులు సహా 12 మరణించారు.
‘తలుపులు మూయండి.. ప్రాణాలు కాపాడండి’
అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో భవనం నుంచి బయటకు వచ్చేటప్పుడు వీలైనంత వరకు తలుపులు మూసివేయాలని అమెరికా అగ్నిమాపక విభాగం పౌరులకు పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ‘‘తలుపులు మూయండి.. ప్రాణాలు కాపాడండి’’ అంటూ సామాజిక మీడియాలో సందేశాలు సైతం ఉంచుతోంది. అలా చేస్తే ఒక ఫ్లాట్లో చెలరేగిన మంటలు మరో ఫ్లాట్కు వ్యాపించే అవకాశంతక్కువని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా