Coronavirus కరోనాతో కలిసి బతికే దశకు అమెరికా..!
అమెరికాలో కరోనావైరస్ (coronavirus) ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కారణంగా కేసుల ఉప్పెన వెల్లువెత్తింది. ఈ వ్యాధిని తట్టుకొని మనిషి మనుగడ
ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలో కరోనావైరస్ (coronavirus), ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కారణంగా కేసుల ఉప్పెన కొనసాగుతోంది. ఈ వ్యాధిని తట్టుకొని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తోందని ఆ దేశ టాప్ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికాలోని ప్రఖ్యాత సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్)లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్(Omicron)కు ఉన్న వ్యాప్తి వేగం కారణంగా అది ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యూటేషన్లు, వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల కారణంగా కరోనావైరస్ (coronavirus) సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడించారు. సమయానికి వ్యాక్సిన్లు తీసుకొన్నవారు.. వైరస్ కారణంగా తలెత్తే తీవ్ర పరిణామాలను తప్పించుకొంటారు. కానీ, వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా తగ్గుతోందని ఫౌచీ అభిప్రాయపడ్డారు.
కరోనా (coronavirus) తట్టుకొనే దిశగా అమెరికా..
అమెరికాలో ఒమిక్రాన్ (Omicron) కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫౌచీ అన్నారు. ఈ క్రమంలో దేశం కొత్త దశలోకి అడుగు పెడుతుందని అంచనా వేశారు. టీకాల కారణంగా పూర్తి రక్షణ పొందిన ప్రజలు.. ఆరోగ్య సమస్యలున్నవారు వైరస్ బారిన పడినా.. తేలిగ్గా చికిత్స చేయడానికి సరిపడా ఔషధాలు ఉన్న స్థితికి దేశం చేరుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు మిలియన్కు పైగా కేసులు.. 1,50,000 మందికి ఆసుపత్రుల్లో చికిత్సలు .. 1,200 మంది ప్రాణాలు కోల్పోతుండటంతో.. తాను అంచనా వేసిన స్థితికి అమెరికా ఇంకా చేరుకోలేదన్నారు. కేవలం ప్రారంభం వద్దే ఉందని అభిప్రాయపడ్డారు.
ఫౌచీ, రిపబ్లికన్ సెనెటర్ మధ్య వాగ్వాదం..
సౌమ్యుడు.. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న ఆంటోనీ ఫౌచీ రిపబ్లికన్ సెనెటర్ రాండ్పౌల్పై నిప్పులు చెరిగారు. ‘‘అతడిలోని పిచ్చితనాన్ని బయటపెట్టుకొని.. ప్రాణాలపైకి తెచ్చుకోవడంతోపాటు కుటుంబాన్ని కూడా రాండ్ పౌల్ వేధిస్తున్నాడు’’ అంటూ ఫౌచీ మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ విచారణలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తిపై వాంగ్మూలం ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఫౌచీ, సీడీసీ డైరెక్టర్ రోఛెల్లె వాలెన్స్కీ, ఎఫ్డీఏ హెడ్ జానెట్ ఉడ్కుక్ సెనెట్ ఎదుట హాజరయ్యారు.
అమెరికాలో పరీక్షలు, కొవిడ్ క్వారంటైన్ నిబంధనల్లో గందరగోళంపై కమిటీ సభ్యులు.. వైద్య నిపుణులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలో రిపబ్లికన్ సెనెటర్ రాండ్ ఫౌల్ మాట్లాడుతూ ప్రజలకు వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. అంతేకాదు.. స్వయంగా టీకా తీసుకోవడానికీ తిరస్కరించారు. అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిత్యం వందల సంఖ్యలో అమెరికన్లు మృతి చెందడానికి కూడా ఫౌచీనే కారణమని తప్పుబట్టారు.
వీటిపై ఆంటోనీ ఫౌచీ తీవ్రంగా స్పందించారు. పౌల్వి పూర్తిగా నిరాధారణమైన ఆరోపణలని తోసిపుచ్చారు. ‘‘ఆయన వ్యక్తిగత ఆరోపణలతో దాడి చేశారు. ఆ ఆరోపణలకు ఒక్క ఆధారమైనా ఉందా..? ఇలాంటి ఆరోపణలు పిచ్చొళ్లను రెచ్చగొడుతున్నాయి.. నాకు, నా కుటుంబానికి, పిల్లలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి’’ అని ఫౌచీ వాపోయారు.
గత డిసెంబర్లో ఓ వ్యక్తి ఏఆర్-15 రైఫిల్ తీసుకొని కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతడు తనను చంపేందుకు బయల్దేరినట్లు పేర్కొన్న విషయాన్ని తాజా విచారణలో ఫౌచీ గుర్తు చేశారు.
హెచ్ఐవీపై పోరుకు కొత్తబాటలు వేసింది ఫౌచీనే..
డాక్టర్ ఫౌచీ 1983 నుంచి పార్టీలతో సంబంధం లేకుండా ఏడుగురు అమెరికన్ అధ్యక్షుల వద్ద అత్యున్నత స్థానాల్లో పనిచేశారు. సైన్స్ వ్యాసాలు రాసే 30 లక్షల మంది రచయితలు అత్యధికసార్లు ప్రస్తావించిన పేర్లలో ఫౌచీ 13వ స్థానంలో ఉన్నారు. వాస్తవానికి ఎయిడ్స్ నిరోధానికి ప్రపంచ వ్యాప్తంగా అనుసరించే వ్యూహాల రూపకర్తల్లో ఫౌచీ ప్రముఖుడని జాన్హప్కిన్స్ యూనివర్శిటీ నివేదిక వెల్లడిస్తోంది. కండోమ్స్, సూదుల వాడకంపై ఆంక్షలు వంటి కీలక వ్యూహాలను సిద్ధం చేశారు. హెచ్ఐవీపై ఆయన చేసిన పరిశోధనలు చరిత్రలో నిలిచిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ