ChatGPT - Google: గూగులమ్మకు కొత్త గుబులు!
గూగుల్... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది.
సవాలు విసురుతున్న ‘చాట్జీపీటీ’
కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణ
గూగుల్... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చింది! తన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్ ఆందోళన చెందుతోంది. కారణం- సాంకేతిక ప్రపంచంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణ- చాట్జీపీటీ!
చాట్జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో తయారైన చాట్బాట్ గూగుల్కు సవాల్ విసురుతోంది. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా, ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాట్జీపీటీని చూసి గూగుల్ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్ను దాటి పోతుందని అనుకుంటున్నారు.
ఏంటీ చాట్జీపీటీ
శాన్ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్వేరే ఈ చాట్జీపీటీ. 2015లో శామ్ ఆల్ట్మన్, ఎలాన్ మస్క్ కలసి 100 కోట్ల డాలర్లతో ఈ కంపెనీని ఆరంభించారు. 2018లో మస్క్ రాజీనామా చేశారు. అయినా పెట్టుబడులు మాత్రం పెడుతున్నారు. 2019లో మైక్రోసాఫ్ట్ కూడా ఇందులో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.
అందుబాటులో ఉందా?
ప్రస్తుతానికి ఇదింకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఉచితంగా అందుబాటులోనే ఉంది. ఓపెన్ఏఐ.కామ్ వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకొని దీన్ని వినియోగించి చూడవచ్చు. వాడుతున్నవారి నుంచి సూచనలు తీసుకొని తీర్చిదిద్దుతున్నారు. లోపాలు లేకుండా పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందుబాటులో రావటానికి సమయం పడుతుంది.
ఏంటి దీని ప్రత్యేకత?
ఇంటర్నెట్లోని కోట్ల పదాల శిక్షణతో రూపొందిన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ జీపీటీ-3ని (జెనెరేటివ్ ప్రి ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్-3) ఓపెన్ఏఐ ప్రకటించింది. ప్రస్తుతానికి 175 బిలియన్ రకాల పారామితులతో కూడిన అత్యంత భారీ, శక్తిమంతమైన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్గా దీన్ని భావిస్తున్నారు. 300 బిలియన్ పదాలను దీని వ్యవస్థలో అమర్చారు.
మనుషుల మాదిరిగా రాతరూపంలో ఆవిష్కరించటమేగాకుండా, అనువాదాల్లో కూడా ఇది ఎంతో కచ్చితంగా ఉంటుంది. గూగుల్ సెర్చి మాదిరిగా ప్రశ్నలకు సమాధానాలను లిస్ట్ చేయటంతో ఆగకుండా... సులభంగా అర్థమయ్యేలా సమాధానాలను రాతరూపంలో రాస్తుంది. చాట్జీపీటీ. అంతేగాకుండా ఏవైనా అంశంపై కొత్త వ్యాసం కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. అంతెందుకు టాపిక్ చెబితే కొత్త కవిత, లేఖలు కూడా తక్షణమే రాసిస్తుంది. మనుషులు మాట్లాడే వివిధ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇవ్వగలుగుతుంది. మనుషులు మాట్లాడుకున్నట్లే పిచ్చాపాటీ కబుర్లు చెబుతుంది. జోక్లు పేలుస్తుంది. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాట్బోట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి పరిధి చాలా పరిమితం. ఈ చాట్జీపీటీ మాత్రం వేగంగా, ఎదురుగా మనిషి కూర్చొని సమాధానం ఇచ్చినట్లే ఏది అడిగినా చెబుతుంది.
గూగుల్ ఎందుకు భయపడుతోంది?
గూగుల్లో ఏదైనా అడిగితే దానికి సంబంధించిన లింక్ల జాబితా వరుసగా వస్తుంది. కానీ అదే చాట్జీపీటీని అడిగితే... లింక్లు ఇచ్చి విడిచిపెట్టకుండా... ఆ అంశాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు వివరంగా అర్థం చేయిస్తుంది. అందుకే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్ ఇంజిన్పై ఆధారపడటం తగ్గుతుందన్నది ఆందోళన. ‘‘గూగుల్ పని అయిపోయినట్లే! బహుశా మరో ఏడాదో రెండేళ్లలోనో కృత్రిమ మేధ గూగుల్ను విచలితం చేయబోతోంది. ఎల్లో పేజెస్ను గూగుల్ ఎలా దెబ్బతీసిందో... చాట్జీపీటీ గూగుల్కు అదే పని చేయబోతోంది’’అని జీమెయిల్ డెవలపర్ పౌల్ బుచెట్ హెచ్చరించటం గమనార్హం. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గూగుల్.. చాట్జీపీటీకి దీటైన సాఫ్ట్వేర్ను రూపొందించే పనిలో పడింది. కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా, చాట్జీపీటీకి మించి, బొమ్మలతో కూడిన సమాధానాలు ఇచ్చేలా కొత్త సాఫ్ట్వేర్తో రావాలని తమ కృత్రిమ మేధ బృందాలను సీఈవో సుందర్పిచాయ్ పురమాయించారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం