Omicron: 70% పిల్లలకు కరోనా ముప్పు ఉండేది..
ప్రపంచవ్యాప్తంగా 19 ఏళ్లలోపు వయసువారిలో 50 నుంచి 70% మంది 2021 చివరినాటికి.. ఒమిక్రాన్ ఉద్ధృతికి ముందు.. కరోనా వైరస్ బారిన పడే ముప్పును ఎదుర్కొన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఒమిక్రాన్ చెలరేగడానికి ముందు ఇదీ పరిస్థితి
అధ్యయనంలో వెల్లడి
లండన్: ప్రపంచవ్యాప్తంగా 19 ఏళ్లలోపు వయసువారిలో 50 నుంచి 70% మంది 2021 చివరినాటికి.. ఒమిక్రాన్ ఉద్ధృతికి ముందు.. కరోనా వైరస్ బారిన పడే ముప్పును ఎదుర్కొన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. మరింత సమర్థవంతమైన టీకాలను ఆవిష్కరించి, ఇంకా ఎక్కువమందికి వాటిని ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది చాటుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్త నమూనాలను పరిశీలిస్తే కొవిడ్-19 తొలి ఉద్ధృతిలో 7.3% మంది కరోనా బారిన పడితే ఆరో ఉద్ధృతికి వచ్చేసరికి అది 56.6 శాతానికి చేరిందని గుర్తించారు. అత్యధికంగా ఆగ్నేయాసియా ప్రాంతంలో (17.9 నుంచి 81.8% వరకు), అత్యల్పంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో (0.01%-1.01%)ని నమూనాల్లో కరోనా కనిపించినట్లు చెప్పారు. అధ్యయనం వివరాలు ‘ఇ-క్లినికల్మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.
వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ అవకాశం
పిల్లల్లో ఎక్కువ వయసున్నవారు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నవారు, అల్పసంఖ్యాక జాతుల నేపథ్యం నుంచి వచ్చినవారిలో ఎక్కువగా యాంటీబాడీలు కనిపించాయి. 2019 డిసెంబరు 1 నుంచి 2022 జులై 10 మధ్య చేసిన పరీక్షల వివరాలను శాస్త్రవేత్తలు క్రోడీకరించి అంచనాలు రూపొందించారు. 70 దేశాలకు చెందిన 7.57 లక్షల మంది పిల్లల వివరాలను వారు పరిశీలించారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు గణనీయంగా పెరగడంతో పాటు అనేకమంది, ముఖ్యంగా పిల్లలు కూడా ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చిందని గుర్తించారు. ‘పిల్లలకు కరోనా ముప్పు తక్కువని ఒమిక్రాన్ వెలుగు చూడడానికి ముందు భావించేవారు. టీకా ఎంతవరకు సురక్షితమనే భయాలూ తల్లిదండ్రుల్లో ఉండేవి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు చాలా నెమ్మదించాయి. ఇప్పటికీ ప్రపంచంలో వ్యాక్సిన్లు పొందని పిల్లల సంఖ్యే ఎక్కువ’ అని అధ్యయనం వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్