అమెరికాలో హిమపాతం.. ఐరోపాలో వేసవి తాపం!
అనూహ్య వాతావరణ మార్పులకు భూగోళం ఆలవాలం అవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా కొద్దిరోజుల కిందటే అమెరికాను మంచు కప్పేయటం చూశాం.
భిన్నమైన శీతాకాలం
అనూహ్య వాతావరణ మార్పులకు భూగోళం ఆలవాలం అవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా కొద్దిరోజుల కిందటే అమెరికాను మంచు కప్పేయటం చూశాం. అసాధారణ హిమపాతంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు, జనజీవనం అల్లాడటం చూశాం. వారం రోజుల్లోనే ఐరోపా వేదికగా మరో అసాధారణ ప్రకృతి పరిణామం ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. గడ్డ కట్టాల్సిన చోట, మంచు పేరుకుపోవాల్సిన చోట ఈ సారి ఆ ఊసే మాయమైంది. వాతావరణం ఎండాకాలంలా వేడిని తలపిస్తోంది.
* జనవరి 1 వచ్చిందంటే.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు ఆల్ప్స్ పర్వతశ్రేణులకు చేరుకుంటారు. పర్వతాలపై పేరుకుపోయిన మంచులో స్కీయింగ్ చేయటానికని వస్తారంతా. ఈ సారీ అలాగే ఆశగా వచ్చారు. తీరా చూస్తే ఆ పర్వత శ్రేణుల్లో మంచు మాయమైంది. చివరకు స్కీయింగ్ నిర్వాహకులు కృత్రిమంగా మంచు పరచి అరకొర వినోదంతో సర్దుకుపొమ్మంటున్నారు. మామూలుగానైతే ఈ సమయానికి ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల దరిదాపుల్లోకి, అంతకంటే తక్కువకు చేరుకుంటాయి. అనేక దేశాలపై మంచు దుప్పటి కప్పేస్తుంది. అలాంటిది ఐరోపాలోని అనేక దేశాల్లో ఈసారి వందేళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలను చూసి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* ఈ నెల మొదటివారం పోలండ్లో 18.9, స్పెయిన్లో 25.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ స్థాయి ఉష్ణోగ్రత మామూలుగా వేసవిలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్, లిథువేనియా, లాత్వియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, బెలారస్ల్లోనూ ఉష్ణోగ్రత వందేళ్లలో ఎన్నడూ ఈ సమయంలో ఇంత ఎక్కువగా నమోదు కాలేదంటున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్లలోనూ ఇదే పరిస్థితి. పోలండ్లోని వార్సాలో గత నెల కంటే 4 డిగ్రీలు ఎక్కువ నమోదు కాగా, స్పెయిన్లో ఎండాకాలాన్ని తలపిస్తోంది. స్కీయింగ్ పండగకు నెలవైన స్విట్జర్లాండ్లో 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పర్యాటకులకు నిరుత్సాహం కలిగిస్తోంది. 2023లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండబోతాయనటానికి ఇది నిదర్శనమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగని ఐరోపా అంతటా ఇలాంటి పరిస్థితి లేదు. రష్యా వైపు మాత్రం ఈ వారాంతంలో మైనస్కు చేరే అవకాశం ఉంది. హీట్డోమ్ కారణంగానే ఈ అసాధారణ మార్పులని శాస్త్రవేత్తలంటున్నారు.
ఏమిటీ హీట్డోమ్?
గిన్నె మూతపై వేడి ఆవిరి పేరుకున్నట్లుగా.. ఏదైనా ప్రాంత వాతావరణ ఉపరితలంలో అధిక పీడనం వల్ల వేడిగాలి పేరుకుపోవటంతో హీట్డోమ్ ఏర్పడుతుంది. 2021లో కెనడా, అమెరికాల్లో ఈ హీట్డోమ్ కారణంగా విపరీతమైన వేడిగాలులు వీచి.. ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్కు చేరుకొని చాలామంది మరణించారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు