Liquor: మద్యం ఒక్క చుక్క తీసుకున్నా.. ఆరోగ్యానికి హానికరమే
ఒక్క చుక్క మద్యం తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తేల్చి చెప్పింది. ఎంత మోతాదులో దాన్ని తీసుకున్నా అది ఆరోగ్యానికి ప్రమాదకరమేనని, మద్యం క్యాన్సర్కు దారి తీస్తుందని హెచ్చరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
దిల్లీ: ఒక్క చుక్క మద్యం తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తేల్చి చెప్పింది. ఎంత మోతాదులో దాన్ని తీసుకున్నా అది ఆరోగ్యానికి ప్రమాదకరమేనని, మద్యం క్యాన్సర్కు దారి తీస్తుందని హెచ్చరించింది. అందుకు సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్వో ది లాన్సెట్ జర్నల్లో ప్రచురించింది. మద్యపానం మహిళల్లో రొమ్ము క్యాన్సర్తో పాటు పేగు, కాలేయ, అన్నవాహిక తదితర ఏడు రకాల క్యాన్సర్లకు కారణభూతమవుతుందని గతంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) వెల్లడించింది. ధర, నాణ్యతతో సంబంధం లేకుండా కొంత మొత్తంలో మద్యం తాగినా.. అది జీవక్రియ వ్యవస్థపై ప్రభావం చూపి శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తూ క్యాన్సరును క్రమంగా పెంచుతుందని పేర్కొంది. క్యాన్సర్ కారక మరణాలు అధికంగా ఉన్న ఐరోపా ప్రాంతంలో పరిశీలించినప్పుడు.. ప్రతిరోజూ 20 గ్రాముల కంటే తక్కువ మోతాదులో స్వచ్ఛమైన మద్యాన్ని తీసుకున్నవారిలో (2017వ సంవత్సరంలో) 23,000 కొత్త క్యాన్సర్ కేసులు వెలుగుచూశాయని, అందులో 50 శాతం మహిళల రొమ్ము క్యాన్సర్ కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్వో తాజా నివేదిక స్పష్టంచేసింది. ‘హృదయ సంబంధిత, టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు మద్యం మేలు చేస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, దాన్ని అధికంగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతాయని నమ్మడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి’ అని పేర్కొంది. ఐరోపా ప్రాంతంలో మద్యం అధికంగా తాగుతున్న వారిలో 20 కోట్ల మంది మద్యపాన కారక క్యాన్సర్తో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ