అమెరికాలో కాల్పుల మోత
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు (అయిదుగురు మహిళలు, అయిదుగురు పురుషులు) దుర్మరణం పాలయ్యారు.
10 మంది మృతి.. మరో 10 మందికి గాయాలు
పరారీలో నిందితుడు
మాంటెరీ పార్క్: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు (అయిదుగురు మహిళలు, అయిదుగురు పురుషులు) దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రిలో చేర్చగా కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లాస్ఏంజెలెస్ ప్రాంతంలోని బాల్రూం డ్యాన్స్ క్లబ్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చైనా నూతన లూనార్ సంవత్సర వేడుకల నేపథ్యంలో వేలాది మంది అక్కడ గుమిగూడారు. ఆ సమయంలో ఓ వ్యక్తి మెషీన్ గన్తో వచ్చి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడి వద్ద గల ఆయుధాన్ని కొందరు వ్యక్తులు గుంజుకుని పోలీసులకు అప్పగించారు. మాంటెరీ పార్క్ సిటీలో కాల్పులకు పాల్పడిన దుండగుడు పరారీలో ఉన్నాడని, ఆసియాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నగరంలో 60 వేల మంది జీవిస్తున్నారు. అమెరికాలో ఈ నెలలో జరిగిన బహిరంగ కాల్పుల్లో ఇది అయిదో ఘటన. మొత్తం మీద అన్ని సంఘటనల్లో 21 మంది మృతి చెందారు. లూసియానాలోని నైట్ క్లబ్లో జరిగిన మరో కాల్పుల ఘటనలో 12 మంది గాయపడ్డారు.
భారత సంతతి వ్యక్తి మృతి: అమెరికాలోని గ్యాస్స్టేషన్(పెట్రోల్బంక్)లో పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి చంపారు. ఈ ఘటన మంగళవారం ఫిలడెల్ఫియా ప్రాంతంలోని టొరెస్డాల్లో జరిగింది. పాత్రో సిబోరమ్ అనే వ్యక్తి ఇక్కడ క్లర్క్గా పనిచేస్తున్నారు. ముగ్గురు దుండగులు మాస్కులు ధరించి.. గ్యాస్స్టేషన్లోని ఓ గదిలోకి చొరబడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న సిబోరమ్ను కాల్చి నగదు రిజిస్టర్ను దొంగిలించి పారిపోయారు. దొంగలను పట్టించిన వారికి 20 వేల అమెరికా డాలర్లను పోలీసులు రివార్డుగా ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు