అమెరికాలో మళ్లీ తుపాకీ కాల్పుల మోత
వరస తుపాకీ కాల్పులతో కాలిఫోర్నియా రాష్ట్రం దద్దరిల్లుతోంది. ఇక్కడి మాంటెరరీ పార్కులో శనివారం చోటుచేసుకున్న విషాదాన్ని మరిచిపోక ముందే కాల్పులు మరోసారి అలజడి సృష్టించాయి.
రెండు ఘటనల్లో 9 మంది మృతి
హాఫ్మూన్ బే, డెస్మోయిన్: వరస తుపాకీ కాల్పులతో కాలిఫోర్నియా రాష్ట్రం దద్దరిల్లుతోంది. ఇక్కడి మాంటెరరీ పార్కులో శనివారం చోటుచేసుకున్న విషాదాన్ని మరిచిపోక ముందే కాల్పులు మరోసారి అలజడి సృష్టించాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో సమీప హాఫ్మూన్ బే నగరంలో రెండు వ్యవసాయ వ్యాపార ప్రదేశాల్లో దుండగుడు కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడు చున్లీ జావ్ (67)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయోవా రాష్ట్రంలో మరో ఘటన
అయోవా రాష్ట్రంలోని డెస్మోయిన్ నగరంలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ జరుగుతున్న ఓ విద్యా సంబంధ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. కార్యక్రమ నిర్వాహకుడు విలియమ్ హోమ్స్కు కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.