Leopard 2: ఈ చిరుత.. సంగ్రామాన పెద్దపులి
లెపర్డ్-2..! (Leopard 2) కొద్దిరోజులుగా ఐరోపాలో మారుమోగుతున్న పేరు ఇది. 11 నెలలుగా తనతో పోరాడుతున్న రష్యాను ఎదుర్కోవడానికి ఈ యుద్ధట్యాంకు అవసరమని ఉక్రెయిన్ (Ukraine) గట్టిగా అడుగుతోంది.
లెపర్డ్-2..! (Leopard 2) కొద్దిరోజులుగా ఐరోపాలో మారుమోగుతున్న పేరు ఇది. 11 నెలలుగా తనతో పోరాడుతున్న రష్యాను ఎదుర్కోవడానికి ఈ యుద్ధట్యాంకు అవసరమని ఉక్రెయిన్ గట్టిగా అడుగుతోంది. దీని తయారీదారైన జర్మనీ ఈ ఆయుధాలు త్వరలో ఉక్రెయిన్కు అందిస్తోంది.
ఏమిటీ లెపర్డ్-2?
లెపర్డ్ అంటే చిరుత అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ అధునాతన ప్రధాన యుద్ధ ట్యాంకు చాలా చురుగ్గా ఉంటుంది. ప్రపంచంలోనే మేటి ఆయుధాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. జర్మనీకి చెందిన క్రాస్ మఫాయ్ వేగ్మన్ (కేఎండబ్ల్యూ) సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. లెపర్డ్-1 పేరుతో తొలిసారిగా 1979లో వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆధునిక వేరియంట్లు వచ్చాయి. ప్రస్తుత లెపర్డ్-2 కాల్పుల సామర్థ్యం అమోఘం. వేగం, చురుగ్గా ఎటైనా కదిలే ఒడుపు దీని సొంతం. ఇందులోని ఆయుధ వ్యవస్థలకు పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది. ఈ ప్రత్యేకతల దృష్ట్యా ఇది అనేక రకాల యుద్ధ క్షేత్రాలకు అనువుగా ఉంటుంది.
ఎన్ని కావాలి?
ప్రస్తుత యుద్ధంపై లెపర్డ్-2 ట్యాంకులు ఏదైనా ప్రభావం చూపాలంటే కనీసం 100 ట్యాంకులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే 300 ట్యాంకులు కావాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి కోరుతున్నారు.
ఉక్రెయిన్కు ఎందుకు అవసరం?
11 నెలల యుద్ధంలో చాలావరకూ ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్.. క్రమంగా రష్యాపై ఎదురుదాడికి దిగాలనుకుంటోంది. ఈ మేరకు కొంతకాలంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రష్యా చేజిక్కించుకున్న తన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన యుద్ధ ట్యాంకులతో భారీగా దాడికి దిగాలని భావిస్తోంది. ఇందుకు లెపర్డ్-2 బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.
ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం 1970ల నాటి టి-72 ట్యాంకులు ఉన్నాయి. వాటిలో సుదూర లక్ష్యాలను గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో సాయపడే ఫైర్ కంట్రోల్ వ్యవస్థ లేదు. పైగా ఈ ట్యాంకుల్లో మందుగుండును ప్రధాన ట్యాంక్ కంపార్ట్మెంట్లో నిల్వ చేయాలి. శత్రు దాడికి గురైనప్పుడు ఇవి పేలిపోయి సొంత బలగాలకు పెను నష్టాన్ని కలిగిస్తాయి. లెపర్డ్-2తోపాటు పశ్చిమ దేశాలకు చెందిన ట్యాంకుల్లో ఈ మందుగుండును భద్రపరచుకోవడానికి ప్రత్యేక రక్షిత కంపార్ట్మెంట్లు ఉన్నాయి.
* లెపర్డ్-2, పశ్చిమ దేశాలకు చెందిన ఇతర ఆధునిక ట్యాంకులు.. రష్యా వద్ద ఉన్న టి- శ్రేణి శకటాల కన్నా చాలా మెరుగైనవి.
* లెపర్డ్-2లో నాటో ప్రామాణీకరించిన 120 ఎంఎం మందుగుండు ఉపయోగిస్తారు. వీటి సరఫరాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఉక్రెయిన్ వాటిని భారీగా సమకూర్చుకోవచ్చు. ప్రస్తుతం ఆ దేశ ట్యాంకులు 125 ఎంఎం మందుగుండును ప్రయోగించగలవు.
మిగతా దేశాల సంగతేంటి?
అమెరికా వద్ద మరింత శక్తిమంతమైన ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు ఉన్నాయి. వీటిని ఉక్రెయిన్కు సరఫరా చేయడానికి అగ్రరాజ్యం నిరాకరించింది. సంక్లిష్టమైన ఈ ఆయుధాల నిర్వహణ చాలా కష్టమని, ఇవి ఉక్రెయిన్కు అక్కరకురావని చెబుతోంది. వీటికి బదులు 100 స్రైకర్ సాయుధ శకటాలు, 50 బ్రాడ్లీ పోరాట వాహనాలను సరఫరా చేసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం తన మనసు మార్చుకొని అబ్రామ్స్ ట్యాంకులను ఉక్రెయిన్కు అందిస్తే జర్మనీ కూడా లెపర్డ్-2లను నేరుగా సరఫరా చేయవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
* లెపర్డ్-2 ట్యాంకులు డీజిల్తో నడుస్తాయి. ఎం1 అబ్రామ్స్కు జెట్ ఇంధనం అవసరం. అందువల్ల అమెరికా ట్యాంకులతో పోలిస్తే జర్మన్ ట్యాంకుల నిర్వహణ ఉక్రెయిన్కు సులువని నిపుణులు వాదిస్తున్నారు.
* ఉక్రెయిన్కు 14 ఛాలెంజర్-2 ట్యాంకులను సరఫరా చేస్తామని బ్రిటన్ ఇటీవల హామీ ఇచ్చింది. ఇవి కూడా శక్తిమంతమైనవే. అయితే బ్రిటన్ వద్ద 227 ఛాలెంజర్ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో వాటిని సరఫరా చేయడం సాధ్యం కాదు.
* చెక్ రిపబ్లిక్, పోలండ్.. సోవియట్ హయాం నాటి టి-72 ట్యాంకులను ఉక్రెయిన్కు సరఫరా చేశాయి. తన లీక్లర్క్ ట్యాంకులను అందించే అంశాన్ని ఫ్రాన్స్ పరిశీలిస్తోంది.
శిక్షణ అవసరం..
ఒకవేళ మిత్రదేశాలు లెపర్డ్-2లను సరఫరా చేసినా.. వాటిని ఆగమేఘాల మీద వినియోగంలోకి తీసుకురావడం ఉక్రెయిన్కు సాధ్యం కాదు. ఈ ట్యాంకుపై కనీస స్థాయి పట్టు సాధించడానికి సైనిక, నిర్వహణ సిబ్బందికి 3-6 వారాల శిక్షణ అవసరం. ట్యాంకును గరిష్ఠస్థాయిలో వినియోగించుకోలేకపోయినా.. స్వల్పకాలంలో 80 శాతం సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నా చాలని ఉక్రెయిన్ భావిస్తోంది.
అంతమాత్రానే గెలుపు సాధ్యం కాదు..
ఆధునిక ట్యాంకులను మోహరించి, యుద్ధంలో గెలిచేస్తామని భావించరాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని సరైన విధానంలో ఉపయోగించుకోవాలంటున్నారు. వీటికితోడు సాయుధ శకటాలూ కావాలి. ఉక్రెయిన్ ట్యాంకులకు రష్యా యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల నుంచి ముప్పు ఉంది. వాటిని ఎదుర్కోవడానికి విమాన విధ్వంసక, నిఘా వ్యవస్థల అవసరం ఉంది. కొత్త ట్యాంకులను పదాతి, శతఘ్ని దళాలు, ఇతర విభాగాలతో సమన్వయపరచుకోవాలి.
* పశ్చిమ దేశాల యుద్ధట్యాంకులు మెరుగైనవే అయినప్పటికీ వాటిని సరఫరా చేస్తున్న దేశాలు నష్టాలకూ సిద్ధం కావాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. యుద్ధంలో వాటిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్