Leopard 2: ఈ చిరుత.. సంగ్రామాన పెద్దపులి
లెపర్డ్-2..! (Leopard 2) కొద్దిరోజులుగా ఐరోపాలో మారుమోగుతున్న పేరు ఇది. 11 నెలలుగా తనతో పోరాడుతున్న రష్యాను ఎదుర్కోవడానికి ఈ యుద్ధట్యాంకు అవసరమని ఉక్రెయిన్ (Ukraine) గట్టిగా అడుగుతోంది.
లెపర్డ్-2..! (Leopard 2) కొద్దిరోజులుగా ఐరోపాలో మారుమోగుతున్న పేరు ఇది. 11 నెలలుగా తనతో పోరాడుతున్న రష్యాను ఎదుర్కోవడానికి ఈ యుద్ధట్యాంకు అవసరమని ఉక్రెయిన్ గట్టిగా అడుగుతోంది. దీని తయారీదారైన జర్మనీ ఈ ఆయుధాలు త్వరలో ఉక్రెయిన్కు అందిస్తోంది.
ఏమిటీ లెపర్డ్-2?
లెపర్డ్ అంటే చిరుత అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ అధునాతన ప్రధాన యుద్ధ ట్యాంకు చాలా చురుగ్గా ఉంటుంది. ప్రపంచంలోనే మేటి ఆయుధాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. జర్మనీకి చెందిన క్రాస్ మఫాయ్ వేగ్మన్ (కేఎండబ్ల్యూ) సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. లెపర్డ్-1 పేరుతో తొలిసారిగా 1979లో వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆధునిక వేరియంట్లు వచ్చాయి. ప్రస్తుత లెపర్డ్-2 కాల్పుల సామర్థ్యం అమోఘం. వేగం, చురుగ్గా ఎటైనా కదిలే ఒడుపు దీని సొంతం. ఇందులోని ఆయుధ వ్యవస్థలకు పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది. ఈ ప్రత్యేకతల దృష్ట్యా ఇది అనేక రకాల యుద్ధ క్షేత్రాలకు అనువుగా ఉంటుంది.
ఎన్ని కావాలి?
ప్రస్తుత యుద్ధంపై లెపర్డ్-2 ట్యాంకులు ఏదైనా ప్రభావం చూపాలంటే కనీసం 100 ట్యాంకులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే 300 ట్యాంకులు కావాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి కోరుతున్నారు.
ఉక్రెయిన్కు ఎందుకు అవసరం?
11 నెలల యుద్ధంలో చాలావరకూ ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్.. క్రమంగా రష్యాపై ఎదురుదాడికి దిగాలనుకుంటోంది. ఈ మేరకు కొంతకాలంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రష్యా చేజిక్కించుకున్న తన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన యుద్ధ ట్యాంకులతో భారీగా దాడికి దిగాలని భావిస్తోంది. ఇందుకు లెపర్డ్-2 బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.
ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం 1970ల నాటి టి-72 ట్యాంకులు ఉన్నాయి. వాటిలో సుదూర లక్ష్యాలను గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో సాయపడే ఫైర్ కంట్రోల్ వ్యవస్థ లేదు. పైగా ఈ ట్యాంకుల్లో మందుగుండును ప్రధాన ట్యాంక్ కంపార్ట్మెంట్లో నిల్వ చేయాలి. శత్రు దాడికి గురైనప్పుడు ఇవి పేలిపోయి సొంత బలగాలకు పెను నష్టాన్ని కలిగిస్తాయి. లెపర్డ్-2తోపాటు పశ్చిమ దేశాలకు చెందిన ట్యాంకుల్లో ఈ మందుగుండును భద్రపరచుకోవడానికి ప్రత్యేక రక్షిత కంపార్ట్మెంట్లు ఉన్నాయి.
* లెపర్డ్-2, పశ్చిమ దేశాలకు చెందిన ఇతర ఆధునిక ట్యాంకులు.. రష్యా వద్ద ఉన్న టి- శ్రేణి శకటాల కన్నా చాలా మెరుగైనవి.
* లెపర్డ్-2లో నాటో ప్రామాణీకరించిన 120 ఎంఎం మందుగుండు ఉపయోగిస్తారు. వీటి సరఫరాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఉక్రెయిన్ వాటిని భారీగా సమకూర్చుకోవచ్చు. ప్రస్తుతం ఆ దేశ ట్యాంకులు 125 ఎంఎం మందుగుండును ప్రయోగించగలవు.
మిగతా దేశాల సంగతేంటి?
అమెరికా వద్ద మరింత శక్తిమంతమైన ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు ఉన్నాయి. వీటిని ఉక్రెయిన్కు సరఫరా చేయడానికి అగ్రరాజ్యం నిరాకరించింది. సంక్లిష్టమైన ఈ ఆయుధాల నిర్వహణ చాలా కష్టమని, ఇవి ఉక్రెయిన్కు అక్కరకురావని చెబుతోంది. వీటికి బదులు 100 స్రైకర్ సాయుధ శకటాలు, 50 బ్రాడ్లీ పోరాట వాహనాలను సరఫరా చేసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం తన మనసు మార్చుకొని అబ్రామ్స్ ట్యాంకులను ఉక్రెయిన్కు అందిస్తే జర్మనీ కూడా లెపర్డ్-2లను నేరుగా సరఫరా చేయవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
* లెపర్డ్-2 ట్యాంకులు డీజిల్తో నడుస్తాయి. ఎం1 అబ్రామ్స్కు జెట్ ఇంధనం అవసరం. అందువల్ల అమెరికా ట్యాంకులతో పోలిస్తే జర్మన్ ట్యాంకుల నిర్వహణ ఉక్రెయిన్కు సులువని నిపుణులు వాదిస్తున్నారు.
* ఉక్రెయిన్కు 14 ఛాలెంజర్-2 ట్యాంకులను సరఫరా చేస్తామని బ్రిటన్ ఇటీవల హామీ ఇచ్చింది. ఇవి కూడా శక్తిమంతమైనవే. అయితే బ్రిటన్ వద్ద 227 ఛాలెంజర్ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో వాటిని సరఫరా చేయడం సాధ్యం కాదు.
* చెక్ రిపబ్లిక్, పోలండ్.. సోవియట్ హయాం నాటి టి-72 ట్యాంకులను ఉక్రెయిన్కు సరఫరా చేశాయి. తన లీక్లర్క్ ట్యాంకులను అందించే అంశాన్ని ఫ్రాన్స్ పరిశీలిస్తోంది.
శిక్షణ అవసరం..
ఒకవేళ మిత్రదేశాలు లెపర్డ్-2లను సరఫరా చేసినా.. వాటిని ఆగమేఘాల మీద వినియోగంలోకి తీసుకురావడం ఉక్రెయిన్కు సాధ్యం కాదు. ఈ ట్యాంకుపై కనీస స్థాయి పట్టు సాధించడానికి సైనిక, నిర్వహణ సిబ్బందికి 3-6 వారాల శిక్షణ అవసరం. ట్యాంకును గరిష్ఠస్థాయిలో వినియోగించుకోలేకపోయినా.. స్వల్పకాలంలో 80 శాతం సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నా చాలని ఉక్రెయిన్ భావిస్తోంది.
అంతమాత్రానే గెలుపు సాధ్యం కాదు..
ఆధునిక ట్యాంకులను మోహరించి, యుద్ధంలో గెలిచేస్తామని భావించరాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని సరైన విధానంలో ఉపయోగించుకోవాలంటున్నారు. వీటికితోడు సాయుధ శకటాలూ కావాలి. ఉక్రెయిన్ ట్యాంకులకు రష్యా యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల నుంచి ముప్పు ఉంది. వాటిని ఎదుర్కోవడానికి విమాన విధ్వంసక, నిఘా వ్యవస్థల అవసరం ఉంది. కొత్త ట్యాంకులను పదాతి, శతఘ్ని దళాలు, ఇతర విభాగాలతో సమన్వయపరచుకోవాలి.
* పశ్చిమ దేశాల యుద్ధట్యాంకులు మెరుగైనవే అయినప్పటికీ వాటిని సరఫరా చేస్తున్న దేశాలు నష్టాలకూ సిద్ధం కావాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. యుద్ధంలో వాటిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM