వీసాల జారీ విషయంలో.. బైడెన్ చర్యలు అభినందనీయం
వీసాల జారీ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మెంగ్ అన్నారు.
కాంగ్రెషనల్ కాకస్(భారత్) సభ్యురాలు గ్రేస్ మెంగ్
వాషింగ్టన్: వీసాల జారీ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మెంగ్ అన్నారు. ‘‘అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. వీసాల కోసం సుదీర్ఘ సమయం పాటు నిరీక్షించడం ఆమోదయోగ్యమైన విషయం కాదు. వీసాల జారీలో నిరీక్షణ సమయం తగ్గించడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హెచ్-1బీ, ఎల్1 వీసాల ఇంటర్వ్యూ కోసం ఎదురుచూసే సమయం 18 నెలల నుంచి 60రోజులకు తగ్గింది. ఇది వ్యాపారులకు, ఉద్యోగులకు, కుటుంబసభ్యులకు ఉపశమనం కలిగిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. భారత్కు సంబంధించిన వీసాల దరఖాస్తులను వేగవంతం చేయడానికి జర్మనీ, థాయ్లాండ్ దేశాల్లో విదేశీ రాయబార కార్యాలయాలను అమెరికా గతవారం ప్రారంభించింది. అంతే కాకుండా భారత్కు కాన్సులర్ అధికారులను పంపింది. కొవిడ్ ఆంక్షలు ఎత్తివేశాక అమెరికాకు పయనమవడానికి వీసాలు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. బీ1, బీ2 లాంటి వీసాలు మెదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు.. అవి జారీ కావడానికి సుదీర్ఘ సమయం తీసుకోవడం భారత్లో ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.