యుద్ధంలో ఉక్రెయిన్ను గెలిపిస్తాం: అమెరికా
రష్యాతో పోరులో ఉక్రెయిన్ గెలిచేలా చేస్తామని, ఆ దేశ యుద్ధ సామర్థ్యాలను పెంచుతామని అమెరికా తెలిపింది. అత్యాధునిక లెపర్డ్-2 ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో వైట్హౌస్ ఈ ప్రకటన చేసింది.
వాషింగ్టన్: రష్యాతో పోరులో ఉక్రెయిన్ గెలిచేలా చేస్తామని, ఆ దేశ యుద్ధ సామర్థ్యాలను పెంచుతామని అమెరికా తెలిపింది. అత్యాధునిక లెపర్డ్-2 ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో వైట్హౌస్ ఈ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ను గెలిపించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. అందుకు నాటో దేశాలతో కలిసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని పేర్కొంది. 14 లెపర్డ్ 2 ఏ6 ట్యాంకులను అందిస్తామని జర్మనీ ప్రకటించగానే అమెరికా కూడా తమ అత్యాధునిక అబ్రామ్స్ ట్యాంకులను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ‘‘యుద్ధక్షేత్రంలో విజయవంతం కావడానికి అవసరమైన సామర్థ్యాలను ఉక్రెయిన్కు అందేలా చేయడం మా మిత్రదేశాల లక్ష్యం’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహా మండలి స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ సమన్వయ కర్త జాన్కిర్బీ తెలిపారు.
రష్యా సంస్థపై అమెరికా ఆంక్షలు
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు అండగా నిలిచినందుకు, ఆఫ్రికాలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినందుకు రష్యాకు చెందిన వాగ్నర్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. దాని అనుబంధ సంస్థలపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు గురువారం అమెరికా ప్రకటించింది.
ఆగని రష్యా దాడులు..11 మంది మృతి
మరోవైపు అత్యాధునిక యుద్ధట్యాంకులు సరఫరా చేస్తామని జర్మనీ, అమెరికా ప్రకటించిన నేపథ్యంలో రష్యా తన దాడులను మరింత ఉద్ధృతం చేసింది. కీవ్, ఒడెసాలపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారని, మరో 11 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. 47 రష్యా క్షిపణులను నేలకూల్చామని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)