కొక్కొరొక్కో... అంటే..
కొక్కొరొక్కో... అంటే కోడి కూస్తోందనుకుంటాం. కానీ ఆ కూత అర్థమేంటి? అదేం చెబుతోంది? ఎవరితో చెబుతోంది? మరోకోడి ఆ కూతనేమని అర్థం చేసుకుంటుంది?
జంతుజాలం భాష తెలిసిపోతుంది
కృత్రిమమేధ ఫలితంగా...
కొక్కొరొక్కో... అంటే కోడి కూస్తోందనుకుంటాం. కానీ ఆ కూత అర్థమేంటి? అదేం చెబుతోంది? ఎవరితో చెబుతోంది? మరోకోడి ఆ కూతనేమని అర్థం చేసుకుంటుంది?
భౌభౌ అంటే కుక్క అరుపు అనుకుంటాం. కానీ ఆ భౌభౌ సందేశం ఏంటి? ఇతర కుక్కలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటాయి?
ఏనుగు ఘీంకారాలకు... సింహం హూంకారాలకు... తుమ్మెద ఝుంకారాలకూ... కాకి కావ్కావ్లకు, పిల్లి మ్యావ్మ్యావ్లకు... కప్ప బెకబెకలకూ... అన్నింటికీ ఓ అర్థముంటుంది. అది మనకు తెలియదు. అంతరిక్షాలకు ఎగిరిపోతూ, విశ్వాంతరాళంలో జీవరాశుల కోసం అన్వేషిస్తున్న మన మేధస్సుకు ఈ భూమ్మీద మనతో జీవిస్తున్న జంతు ప్రపంచం సందేశాలు ఇప్పటికీ అర్థంగాని ప్రహేళికలే! పెంచుకున్న కుక్క మన మాటల్ని అర్థం చేసుకుంటుంది. మన ఆదేశాలు పాటిస్తుంది. కానీ మేధస్సుందనుకుంటున్న మన మానవాళి మాత్రం వాటితో ఎన్నేళ్లు సహవాసం చేసినా భౌభౌలకు అర్థం ఇప్పటికీ తెలుసుకోలేదు.
... అయితే అదంతా గతం! మనిషి మేధస్సుతో సాధ్యం కానిది తను సృష్టించిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పుణ్యమా అని సాధ్యమవుతోంది. ఈ భూమ్మీదున్న ఇతర జీవజాలం చేసే శబ్దాలకు, వాటికున్న భావాలకు అర్థం చెప్పబోతోంది
కృత్రిమ మేధ!
మానవ భాషలను అర్థం చేసుకొని, ఇతర భాషల్లోకి తర్జుమా చేయటానికి సంవత్సరాల తరబడి కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్ పరిశోధనలు కొనసాగాయి. వాటి ఫలితంగా అనేక సాంకేతిక భాషలు, అలెక్సా అంతకుమించిన ఆధునిక చాట్బోట్స్, ఇతర స్మార్ట్ పరికరాలు ఆవిష్కృతమయ్యాయి. అదే పద్ధతిలో జంతుజాలం సందేశాలను, వాటి భాషను అర్థం చేసుకోవటానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ పరిరక్షణకు, జీవజాలం సుస్థిరతకు ఇది ఉపయోగపడుతుందం టున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ పరిశోధనలు ఓ కొలిక్కి వస్తున్నాయి.
‘‘మానవులు, జంతుజాలం మధ్య భాషా ప్రసారంలో కృత్రిమమేధను ఉపయోగించి చేస్తున్న పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి’’ అని ఎర్త్ స్పీసిస్ ప్రాజెక్ట్ (ఈఎస్పీ) వ్యవస్థాపకులు కేటీ జకారియన్ తెలిపారు. కాలిఫోర్నియాలోని ఈ సంస్థ జంతుజాలం భాషను డీకోడ్ చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్ను ఉపయోగించి వివిధ జంతుజాలం శబ్దాలను, కదలికలను నిశితంగా రికార్డు చేసి, విశ్లేషిస్తున్నారు. వివిధ సందర్భాల్లో అవెలా స్పందిస్తున్నాయో కూడా కృత్రిమమేధ ద్వారా విశ్లేషణ సాగుతోంది.
ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఇళ్లు, కొండలు, గుట్టలు, దట్టమైన అడవులు, సముద్ర గర్భం... ఇలా అనేకానేక ప్రాంతాలతో పాటు అనేక జంతువులు, పక్షులు, చెట్లకు కూడా, అత్యంత సున్నితమైన సెన్సార్లు, రికార్డింగ్ పరికరాలు, సూక్ష్మ కెమెరాలను అమర్చారు. ఇళ్లలోని పెంపుడు జంతువులపైనా ఈ ప్రయోగం కొనసాగుతోంది. ఈఎస్పీతో ప్రపంచవ్యాప్తంగా మరో 40 పర్యావరణ సంస్థలు, అనేకమంది బయాలజిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకుంటున్నారు. ఇలా సేకరించిన టన్నుల కొద్ది డేటాను విశ్లేషించటం మానవమాత్రులకు అయ్యేది కాదు. అందుకే కృత్రిమమేధ సాయం తీసుకుంటున్నది. ఇలా సేకరించిన సమాచారమంతటినీ పరిశీలించి వాటి ఆధారంగా వివిధ సందర్భాల్లో అవి స్పందించే తీరులను బేరీజు వేసి... వాటి ప్రవర్తనకు ముడిపెట్టి ఆల్గరిథమ్స్ ద్వారా విశ్లేషిస్తారు.
‘‘భారీగా ఉండే ఏనుగులు మనుషులు వినలేని శబ్దాలు చేస్తాయి. దూరంగా ఉండే ఏనుగులు ఈ శబ్దాలను విని వాటి గమనాన్ని కొనసాగిస్తాయి. ఒకరకంగా ఇది మనకు టెలిపతీలాంటిది. ఇప్పుడు సాకేంతిక పరికరాల కారణంగా అలాంటి శబ్దాలనూ వినగలుగుతున్నాం. ఏనుగులు మనుషులకు ఒకరకంగా, తేనెటీగలకు మరోరకంగా సంకేతాలనిస్తాయి. అంతేగాదు, మనుషులను భయపెట్టడానికి ఒకరకంగా, మామూలుగా మరోరకంగా స్పందిస్తాయి. అలాగే తేనటీగలైతే వందల రకాల శబ్దాలు చేస్తాయి. కేవలం వాటి సందేశాలు, సంకేతాలను అర్థం చేసుకోవటం కాదు. వాటిని అవెలా అర్థం చేసుకుంటున్నాయో తెలుసుకోవటం మనమందున్న అతిపెద్ద సవాలు. అంటే ఒక గబ్బిలం శబ్దాన్ని మరో గబ్బిలం ఏం అర్థం చేసుకుంటుందో తెలుసుకోవటం చాలా కష్టమైన పని. ఈ భూమి సకల జంతుజాల సమ్మిళితం. కొమ్మకొమ్మకో సన్నాయి మోగుతుంటుంది. ప్రతి జీవికీ ఓ భాషుంది. మనం గుర్తించలేనివాటిని లేనే లేవనుకోవటం మానవ సహజగుణం. కానీ ఇప్పటిదాకా అలా మన భావనలకు అందని వాటిని సాంకేతికత కారణంగా అర్థం చేసుకునే వీలవుతోంది. అయితే దీన్ని కూడా మనిషి స్వార్థానికి వినియోగించుకుంటే అంతకంటే వినాశనానికి దగ్గరి మార్గం లేదు’’ అని జీవశాస్త్రవేత్త, రచయిత కరెన్ బాకెర్ హెచ్చరిస్తున్నారు.
జంతుజాలం నుంచి, ఈ పర్యావరణం నుంచి వస్తున్న శబ్దాలు, వాటి సందేశాల ఆధారంగా... మానవాళి తన సామాజిక, భౌతిక వ్యవస్థల్లో మార్పులు చేసుకోగలుగుతుంది. అంతేకాదు... ఇతర జీవుల భాషను అర్థం చేసుకోవటమంటే... పర్యావరణ పరిరక్షణలో ఇతరుల మాటకు విలువిస్తున్నామని అర్థం’’
కేఫిర్త్ బటర్ఫీల్డ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృత్రిమమేధ విభాగాధిపతి
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు