26 వేల ఐస్క్రీం పుల్లలతో రంగోలి
భారత్కు చెందిన తల్లీకూతుళ్లు సింగపూర్లో 26 వేల ఐస్క్రీం పుల్లలతో రంగోలి కళాకృతి వేసి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు.
సింగపూర్: భారత్కు చెందిన తల్లీకూతుళ్లు సింగపూర్లో 26 వేల ఐస్క్రీం పుల్లలతో రంగోలి కళాకృతి వేసి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. తమిళ సంస్కృతి ఉట్టి పడేలా సుధా రవి, ఆమె కుమార్తె రక్షిత ముగ్గులు వేస్తుంటారు. దీనికోసం ప్రతిసారి బియ్యం పిండి, చాక్, చాప్ స్టిక్స్ను ఉపయోగించి ముగ్గులు వేస్తుండేవారు. అయితే ఈ సారి మాత్రం విభిన్నంగా నెలపాటు శ్రమించి 26వేల ఐస్క్రీం పుల్లలతో తమిళ కవులు-పండితులైన తిరువళ్లువర్, అవ్వైయార్, భారతీయార్, భారతీదాసన్ చిత్రాలను వేశారు. కళామంజరి అనే సంస్కృత సంస్థ లిషా అనే సంఘంతో కలిసి ఈ రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించింది. 3,200 చదరపు అడుగుల ముగ్గు వేసి 2016లోనే సుధా రికార్డు సృష్టించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఆర్సీబీ అందుకే టైటిల్ గెలవలేదు: క్రిస్ గేల్
-
World News
Afghanistan: ఉగ్రవాదం నుంచి ప్రభుత్వాధికారులుగా.. తాలిబన్లలోనూ క్వైట్ క్విట్టింగ్!
-
India News
Manish Sisodia: జైలు నుంచి దిల్లీ విద్యార్థులకు సిసోదియా ప్రత్యేక సందేశం!
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
Movies News
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోసం మరో యంగ్ డైరెక్టర్.. త్రివిక్రమ్ కథతో
-
Politics News
Congress Vs SP: కూటమిపై కొట్లాట..కాంగ్రెస్ వద్దు.. మేం లేకుండా ఎలా?