పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్లోని పెషావర్లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్ లైన్స్లోని ఓ మసీదులో ఉగ్ర ముఠా తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సభ్యుడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రార్థనలు జరుగుతుండగా పేల్చుకున్న మానవ బాంబు
61 మంది దుర్మరణం, 150 మందికి గాయాలు
ఉగ్ర ముఠా టీటీపీ ప్రతీకార చర్య
పెషావర్: పాకిస్థాన్లోని పెషావర్లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్ లైన్స్లోని ఓ మసీదులో ఉగ్ర ముఠా తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సభ్యుడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు, సైనిక సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కనీసం అయిదుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, మసీదుకు చెందిన మత గురువు మౌలానా షహీబ్జాదా నూరుల్ అమీన్ మరణించినట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు మసీదులో భద్రతా సిబ్బంది సహా మరికొందరు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పేలుడు ధాటికి మసీదులోని కొంత భాగం కూలిపోయిందని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో మసీదు వద్ద సుమారు 400 మంది పోలీసులు ఉన్నారని, దాడికి పాల్పడిన వ్యక్తి నాలుగంచెల భద్రతను దాటుకొని మసీదులోకి వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడ భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. అఫ్గానిస్థాన్లో గతేడాది ఆగస్టులో తమ కమాండర్ ఉమర్ ఖలీద్ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు టీటీపీ ప్రకటించింది. 2007లో ఏర్పాటైన టీటీపీ కొన్నేళ్లుగా పాక్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. 27 మంది మృతులకు సాయంత్రం సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మాహుతి దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడినవారికి ఇస్లాంతో సంబంధం లేదని అన్నారు. ‘‘పాక్ను రక్షించే బాధ్యతల్లో ఉన్నవారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని అనుకుంటున్నారు. దాడిలో మరణించినవారి త్యాగాలు వృథా కావు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తాం’’ అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)