భారతీయ అమెరికన్లకు కీలక సభ్యత్వాలు
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీలలో నలుగురు భారత సంతతి అమెరికన్లను సభ్యులుగా నియమించారు.
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీలలో నలుగురు భారత సంతతి అమెరికన్లను సభ్యులుగా నియమించారు. అమెరికాలో నానాటికీ పెరుగుతున్న భారతీయ అమెరికన్ల ప్రాముఖ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ప్రమీలా జయపాల్, అమీబెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నాలను ఈ నియామకాలు వరించాయి. వలస వ్యవహారాల ఉప సంఘ సభ్యురాలిగా నియమితులైన ప్రమీలా జయపాల్ (57) పదహారేళ్ల వయసులో అమెరికాకు వలస వచ్చి, 17 ఏళ్ల తరవాత అమెరికా పౌరసత్వం పొందారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన మొట్టమొదటి దక్షిణాసియా మహిళనైన తాను ఈ సభ్యత్వం పొందడాన్ని గొప్ప గౌరవంగా పరిగణిస్తున్నానని ఆమె చెప్పారు. అమెరికా వెలుపల పుట్టి అమెరికా పౌరసత్వం పొంది కాంగ్రెస్లో సభ్యులైన రెండు డజన్ల మందిలో తానూ ఒకరినని జయపాల్ తెలిపారు. గూఢచర్య వ్యవహారాలపై శక్తిమంతమైన సభా సంఘ సభ్యత్వాన్ని అమీబెరా (57) పొందారు. సీఐఏ, జాతీయ భద్రతా సంస్థ ఎన్.ఐ.ఏ, సైన్య గూఢచారి సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించే సంఘమది. ఆరుసార్లు కాంగ్రెస్కు ఎన్నికైన బెరా.. విదేశాంగ వ్యవహారాల సంఘం, శాస్త్ర-సాంకేతిక, అంతరిక్ష వ్యవహారాల సంఘంలో కూడా సభ్యుడే. అమెరికాకు, ప్రపంచానికి చైనా వల్ల పొంచివున్న ముప్పును ఎదుర్కొనే అంశంపై కొత్తగా ఏర్పాటైన సభా సంఘంలో రాజా కృష్ణమూర్తి సభ్యుడయ్యారు. ఈ సంఘంలో మరొక భారతీయ అమెరికన్ రో ఖన్నానూ సభ్యుడిగా నియమించారు.
అధ్యక్ష పదవికి పోటీలో హేలీ!
ప్రముఖ భారతీయ అమెరికన్ రాజకీయ నాయకురాలు నిక్కీ హేలీ తాను ఈ నెల 15న నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సిందిగా మద్దతుదారులను, శ్రేయోభిలాషులను ఆహ్వానించారు. 2024 నవంబరు 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీచేయదలచినట్లు బహుశా ఆమె ప్రకటిస్తారని భావిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జరగబోయే రిపబ్లికన్ ప్రైమరీలలో పార్టీ సభ్యుల మద్దతును చూరగొంటే ఆమె అధ్యక్ష బరిలో దిగగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం