మాపై దాడి.. ఇజ్రాయెల్ పనే
తమ భూభాగంలో ఉన్న ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపించింది. గురువారం ఐరాసకు రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొంది.
ఐరాసకు ఇరాన్ లేఖ
దుబాయ్: తమ భూభాగంలో ఉన్న ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపించింది. గురువారం ఐరాసకు రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొంది. దాడిపై ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని లేఖలో స్పష్టం చేసింది. ‘ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో ఉన్న ఓ ఆర్మీ ఆయుధ కర్మాగారంపై గత శనివారం మూడు డ్రోన్లు దాడి చేయగా వాటిలో రెండింటిని కూల్చేశాం. మూడో డ్రోన్ వల్ల స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లింది. మా ప్రాథమిక దర్యాప్తులో ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్లు తేలింది. తగిన సందర్భంలో సరైన రీతిలో బదులిస్తాం’ అని పేర్కొంది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సాయంతో ఈ దాడులు చేశామని కొంత మంది ఇరాన్ అధికారిక వార్తా చానల్లో చెబుతున్నప్పటికీ.. అవి ఇరాన్ అద్దెకు తెచ్చుకున్నవారు చెప్పే సాక్ష్యాలు కావొచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దాడి జరిగిన తర్వాతి రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారుడు చేసిన ట్వీట్పైనా ఐరాసకు ఇరాన్ ఫిర్యాదు చేసింది. ‘ఇరాన్లో అది పేలుళ్ల రాత్రి.. ఉక్రెయిన్ ముందే హెచ్చరించింది’ అని ఆ ట్వీట్లో ఉంది.
క్షిపణి కేంద్రంపైనే దాడి?
ఇస్ఫహాన్లో రెండు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఈ నగరంలో మరో నాలుగు అణు ప్రయోగశాలలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా దాడి జరిగిన ప్రదేశం ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణి అభివృద్ధి కేంద్రం కావొచ్చని మొసాద్ మాజీ చీఫ్ డానీ యాటమ్ ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోలో సోమవారం పేర్కొన్నారు. ఇరాన్ అభివృద్ధి చేసిన పలు రకాల ఆయుధాలను సిరియా, లెబనాన్, పాలస్తీనాకు సరఫరా చేయడం ఇజ్రాయెల్లకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇస్ఫహాన్లోని క్షిపణి కేంద్రాన్ని మొసాద్ లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.
భారీ నష్టమే జరిగిందా..?
క్వాడ్ కాప్టర్లకు పేలుడు పదార్థాలు అమర్చి దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది ఆ ఆయుధ స్థావరంపై మూడు నుంచి నాలుగు పేలుళ్లు చోటు చేసుకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని లండన్లోని ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. భారీ నష్టమే జరిగే అవకాశం ఉందని తెలిపింది.
రష్యా-ఉక్రెయిన్ కోణం ఉందా?
ఇరాన్ నుంచి చౌకగా క్షిపణులు కొనుగోలు చేయాలని రష్యా యత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సాయంతో క్షిపణి కేంద్రంపై అమెరికానే దాడి చేయించిందనే ప్రచారం ఉంది. ఈ దాడి సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ పర్యటనలోనే ఉండటం గమనార్హం.
ఇరాన్ అణు కార్యకలాపాలపై అనుమానాలు
ఇరాన్ తమకు చెబుతున్న దానికి భిన్నంగా అణు కార్యకలాపాలు చేపడుతోందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) బుధవారం ప్రకటించింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫోర్దో అణు కేంద్రాన్ని తమ ప్రతినిధి తనిఖీ చేసినపుడు ఈ వివరాలు బయటపడ్డాయని వెల్లడించింది.
గాజాపై ఇజ్రాయెల్ రాకెట్ దాడి
టెల్ అవీవ్: గాజా ప్రాంతంలో ఉన్న ఓ రాకెట్ తయారీ కేంద్రంపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్య వర్గాలు గురువారం ప్రకటించాయి. హమాస్ దళాల ఆధ్వర్యంలో ఉన్న ఆ తయారీ కేంద్రంలో పలు రసాయనాలు ఉన్నాయని తెలిపింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పాలస్తీనా ఖైదీల పట్ల మరింత కఠినంగా ఉంటామని ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతకు కొన్ని గంటల ముందు పాలస్తీనా మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ను గగనతలంలోనే నిలువరించామని ఇజ్రాయెల్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!