హెచ్ 1బీ వీసాల తిరస్కరణలతో.. అమెరికా కంపెనీలకు సిబ్బంది కొరత
ఏటా 85,000 మంది విదేశీ నిపుణులకు మాత్రమే హెచ్ 1బీ వీసాలు మంజూరవుతున్నందున అమెరికన్ కంపెనీల సిబ్బంది అవసరాలు తీరడం లేదని ఒక అధ్యయనం తెలిపింది.
వాషింగ్టన్: ఏటా 85,000 మంది విదేశీ నిపుణులకు మాత్రమే హెచ్ 1బీ వీసాలు మంజూరవుతున్నందున అమెరికన్ కంపెనీల సిబ్బంది అవసరాలు తీరడం లేదని ఒక అధ్యయనం తెలిపింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్.ఎఫ్.ఎ.పి.) సంస్థ నిర్వహించిన అధ్యయనమిది. గతేడాది ఏప్రిల్లో అమెరికా కంపెనీలు 4,83,000 హెచ్ 1బీ వీసా దరఖాస్తులు సమర్పించగా.. వాటిలో 85,000 దరఖాస్తులకు వీసాలు లభించాయి. విదేశీ నిపుణులు అమెరికాలో వైద్యం, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో ఆరేళ్లపాటు పనిచేయడానికి హెచ్ 1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఆరేళ్ల తరవాత శాశ్వత నివాసం కింద గ్రీన్కార్డులు పొందడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్నవారిలో 70 శాతం మందికి పైగా విదేశీ విద్యార్థులే. వారిలోనూ భారత్, చైనా విద్యార్థులే ఎక్కువ. ఏటా మంజూరయ్యే 85,000 హెచ్ 1బీ వీసాల్లో 20 వేల వీసాలను అమెరికాలో విద్యాభ్యాసం చేసిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు. అమెరికా కార్మిక బలగం 16.5 కోట్లు కాగా, వారిలో హెచ్ 1బీ వీసాదారుల సంఖ్య కేవలం 0.05 శాతం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాకు విదేశీ నిపుణులు, సాధారణ కార్మికుల వలసలను వ్యతిరేకించినందున హెచ్ 1బీ వీసాËల్లో అత్యధికం తిరస్కరణకు గురయ్యేవి. దీనివల్ల నిపుణుల కొరత ఏర్పడి అమెరికన్ కంపెనీలు తమ పనులను, సిబ్బందిని విదేశాలకు తరలించడం ఎక్కువైంది.
* టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం హెచ్ 1బీ వీసాదారులను ఇబ్బంది పెడుతోంది. అయితే, వారిలో 79 శాతం మందికి మూడు నెలల్లోనే కొత్త ఉద్యోగం లభిస్తోంది. ప్రతి 10 మందిలో నలుగురు నెల రోజుల్లోనే కొత్త ఉద్యోగం సాధించగలుగుతున్నారని జిప్ రిక్రూటర్ సంస్థ సర్వేలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM