Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్
రణరంగంలో తమను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదని, ఆధునిక యుగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా, జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
ఆధునిక ముసుగులో నాజీ భావజాలం
అమెరికా, జర్మనీలను ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యలు
మాస్కో: రణరంగంలో తమను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదని, ఆధునిక యుగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా, జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి పోరాటంలో భాగమైన వారికి పుతిన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ వద్ద రష్యా.. 91 వేలమంది జర్మన్ బలగాలను బంధించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధగతిని మార్చింది. ఈ స్టాలిన్ గ్రాడ్ను ప్రస్తుతం వొల్గొగ్రాడ్గా వ్యవహరిస్తున్నారు.
అమెరికా 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు, జర్మనీ 14 లెపర్డ్ 2 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్కు అందిస్తుండటంపై పుతిన్ మండిపడ్డారు. 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మేం మా ట్యాంకులను వారి సరిహద్దుల్లోకి పంపడం లేదు. కానీ, వారిని ఎదుర్కొనే మార్గాలున్నాయి. యుద్ధం ఆయుధాలకే పరిమితం కాదని వారు అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆధునిక ముసుగులో నాజీ భావజాలాన్ని చూస్తున్నాం. అది మరోసారి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. పశ్చిమ దేశాల దురాక్రమణను కలిసికట్టుగా ఎదిరించాలి. జర్మనీ ట్యాంకులతో రష్యాకు ముప్పు ఉందనేది నమ్మలేని నిజం. అయితే, రష్యా తన భద్రతకు ప్రమాదంగా మారిన వాటికి గతంలో తగిన సమాధానం కూడా చెప్పింది’ అని పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా జర్మనీని ఉద్దేశించి పుతిన్ పేర్కొన్నారు.
జెలెన్స్కీతో ఈయూ నేతల భేటీ
కీవ్, బెర్లిన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన పలువురు అధికారులు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. వీరిలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఛార్లెస్ మైఖెల్, 15 మంది యూరోపియన్ కమిషనర్లు ఉన్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు సహకరిస్తామని తెలిపేందుకు, అలాగే ఈయూలోనూ, నాటోలోను ఆ దేశం చేరికపై వారు చర్చించారు. మరోపక్క తమ దేశానికి చెందిన పాత తరం లెపర్డ్ 1 యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్కు అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్టెఫెన్ హెబెస్ట్రిట్ స్పష్టం చేశారు. అయితే ఎన్ని ట్యాంకులను పంపబోయేది ఆయన వివరించలేదు.
లిబియా, సూడాన్ల నుంచి వాగ్నర్ గ్రూప్ బహిష్కరణపై అమెరికా దృష్టి
కైరో: రష్యా అధ్యక్షుడు పుతిన్తో సన్నిహిత సంబంధాలు గల వాగ్నర్ గ్రూప్ను కల్లోలిత లిబియా, సూడాన్ల నుంచి బహిష్కరించేందుకు అమెరికా తన చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజిప్టు, యూఏఈలతో సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా సూడాన్, లిబియాల్లోని సైనిక నేతలపై ఆ గ్రూపుతో సంబంధాలు తెంచుకునేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కొన్ని నెలల క్రితమే వాగ్నర్ గ్రూప్పై అమెరికా పలు ఆంక్షలను విధించింది. కిరాయి సైనికులతో నడిచే ఈ గ్రూపు రష్యా ఒలిగార్క్ యెవ్జెనీ ప్రిగోఝిన్కు చెందినది. ఆయన పుతిన్కు అత్యంత సన్నిహితుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ