మరో గూఢచర్య బెలూన్ని గుర్తించిన అమెరికా
లాటిన్ అమెరికా ప్రాంతంలో ప్రయాణిస్తున్న మరో భారీ బెలూన్ను గుర్తించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది.
లాటిన్ అమెరికా గగనతలంలో ఉన్నట్లు వెల్లడి
బ్లింకన్ పర్యటన గురించి తెలియదన్న డ్రాగన్
వాషింగ్టన్: లాటిన్ అమెరికా ప్రాంతంలో ప్రయాణిస్తున్న మరో భారీ బెలూన్ను గుర్తించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఇది వరకే మోంటానో రాష్ట్రంలో ఒక బెలూన్ను గుర్తించగా తాజాగా మరో బెలూన్ ఆచూకీ బయటపడడం గమనార్హం. ‘‘లాటిన్ అమెరికా గగనతలంలో ఓ బెలూన్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. అది చైనాకు చెందిన మరో గూఢచర్య బెలూన్ అని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే సమాచారం లేదు’’ అని పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు. మొదట గుర్తించిన చైనా బెలూన్ మరికొన్ని రోజుల పాటు అమెరికా గగనతలంలోనే ప్రయాణించే అవకాశముందని రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది. భారీపేలోడ్లతో ప్రయాణిస్తున్న ఆ బెలూన్ స్వయంచోదక వ్యవస్థ సరిగానే పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. తూర్పు దిశగా వెళ్తున్న ఆ బెలూన్ను ట్రాక్ చేస్తున్నామని.. ఏం చేయాలనేదానిపై తమ ముందున్న మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ఈ బెలూన్ అలాస్కా మీదుగా యూఎస్ గగనతలంలోకి ప్రవేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
బయటకు పంపేయడమే ప్రథమ కర్తవ్యం
అమెరికా గగనతలంలో ఎగురుతున్న గూఢచర్య బెలూన్ను దేశ సరిహద్దుల ఆవలకు పంపించేయడమే తమ ప్రధాన కర్తవ్యమని విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్ శుక్రవారం ప్రకటించారు. చైనా వివరణపై స్పందిస్తూ.. తమ స్థానంలో చైనా ఉండి ఉంటే ఎలా స్పందించి ఉండేదో ఊహించగలనని విమర్శించారు. ఈ ఘటన తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లేనని ఆయన స్పష్టం చేశారు. చైనా పర్యటనను వాయిదా వేసుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
పర్యటన గురించి చర్చలే జరగలేదు: చైనా
బెలూన్ ఘటన నేపథ్యంలో ఆంటొనీ బ్లింకన్ తన చైనా పర్యటనను వాయిదా వేసుకోడాన్ని డ్రాగన్ తేలిగ్గా తీసుకుంది. ఆ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల మధ్యా అసలు చర్చలే జరగలేదని శనివారం ఉదయం స్పష్టం చేసింది. అమెరికా ఏమైనా ప్రకటించి ఉంటే అది వారి సమస్యని, తమకు తెలియదని కుండబద్దలు కొట్టింది. బెలూన్ ఘటన అనుకోకుండా జరిగిందేనని మరోసారి స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు