ముషారఫ్ హయాంలో పరిష్కారం దిశగా కశ్మీర్ వివాదం!
ఎప్పటి నుంచో భారత్-పాక్ మధ్య నలుగుతూ వస్తున్న జమ్మూ-కశ్మీర్ వివాదానికి దాదాపు పరిష్కారం లభించినంత ప్రయత్నం పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హయాంలో జరిగిందని పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి వెల్లడించారు.
దిల్లీ: ఎప్పటి నుంచో భారత్-పాక్ మధ్య నలుగుతూ వస్తున్న జమ్మూ-కశ్మీర్ వివాదానికి దాదాపు పరిష్కారం లభించినంత ప్రయత్నం పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హయాంలో జరిగిందని పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి వెల్లడించారు. 2004-07 మధ్య అనధికారిక చర్చల్లో నాలుగు అంశాలపై ఒక అవగాహనకు వచ్చి వివాదాన్ని పరిష్కరించేలా రంగం సిద్ధమైందనీ, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ముందడుగు పడలేదని కసూరి పేర్కొన్నారు. ‘నైదర్ ఏ హాక్.. నార్ ఏ డోవ్’ పేరుతో ఈ పుస్తకం 2015లో ప్రచురితమైంది. చట్రం నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం సాధ్యమేననే భావన అప్పట్లో రెండు దేశాల నేతల్లోనూ వ్యక్తమైందని రచయిత పేర్కొన్నారు. 2001లో గుజరాత్లో సంభవించిన పెనుభూకంప విషాదంపై అప్పటి ప్రధాని వాజ్పేయీతో ముషారఫ్ ఫోన్లో మాట్లాడిన తర్వాత రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. వివాద పరిష్కారాన్ని ఏ దేశమూ తమ విజయంగా అభివర్ణించుకోకూడదని రెండు దేశాలూ అంగీకరించుకున్నాయని వివరించారు.
దావూద్ అప్పగింతపై ముషారఫ్తో మాట్లాడిన ఆడ్వాణీ
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంను విచారణ నిమిత్తం భారత్కు అప్పగించాలంటూ 2001లో అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్.కె.ఆడ్వాణీ చేసిన ప్రస్తావనతో ముషారఫ్ ముఖం కందగడ్డలా మారిపోయింది. దాని గురించి ఆడ్వాణీయే 2011లో ఒక బ్లాగులో రాసుకొచ్చారు. ఆగ్రా చర్చల కోసం భారత్కు వచ్చి, రాష్ట్రపతి భవన్లో బసచేసిన ముషారఫ్తో ఆడ్వాణీ భేటీ అయినప్పుడు ఇది చోటు చేసుకుంది. పాక్పై ముషారఫ్కు పూర్తి పట్టున్న రోజుల్లోనే అబోటాబాద్లో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్లాడెన్ రహస్య స్థావరం నిర్మాణం జరిగిన విషయాన్నీ ఆడ్వాణీ ప్రస్తావించారు. దావూద్ తమ దేశంలో లేడని ముషారఫ్ అప్పుడు బుకాయించేసినా అది పచ్చి అబద్ధమని అదే సమావేశంలో పాల్గొన్న పాక్ అధికారి ఒకరు తనకు ఆ తర్వాత చెప్పినట్లు ఆడ్వాణీ బ్లాగులో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసరం ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!