Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్‌ మెచ్చుకోలు

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్‌ ముషారఫ్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా సేవలందించిన ఎం.ఎస్‌.ధోనీ జులపాల జుత్తును ఇష్టపడేవారు. దాన్ని కత్తిరించుకోవద్దని ఓసారి సూచించారు.

Published : 06 Feb 2023 08:08 IST

దిల్లీ: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్‌ ముషారఫ్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా సేవలందించిన ఎం.ఎస్‌.ధోనీ జులపాల జుత్తును ఇష్టపడేవారు. దాన్ని కత్తిరించుకోవద్దని ఓసారి సూచించారు. ఉత్కంఠభరిత భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను ఆయన మైదానంలో వీక్షించేవారు. చివరిసారిగా 2006లో భారత్‌ జట్టు పాక్‌లో పర్యటించింది. లాహోర్‌లో నిర్వహించిన మ్యాచ్‌లో ధోనీ 46 బంతుల్లో 72 పరుగులు చేసి తన జట్టును గెలిపించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. మ్యాచ్‌ను వీక్షించిన ముషారఫ్‌ భారత క్రికెట్‌ జట్టుకు అభినందనలు తెలపడంతోపాటు జులపాల జుత్తును కత్తిరించుకోవద్దని ధోనీకి సూచించారు. భారత జట్టుకు బహుమతి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని