ఇస్లామిక్‌ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా దేశాలు

ఇస్లామిక్‌ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా ఎడారి చుట్టుపక్కల ఉన్న దేశాలు (సబ్‌ సహారన్‌ ఆఫ్రికా) మారుతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) నివేదిక వెల్లడించింది.

Published : 08 Feb 2023 04:54 IST

యూఎన్‌డీపీ నివేదిక వెల్లడి

నైరోబి (కెన్యా): ఇస్లామిక్‌ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా ఎడారి చుట్టుపక్కల ఉన్న దేశాలు (సబ్‌ సహారన్‌ ఆఫ్రికా) మారుతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) నివేదిక వెల్లడించింది. ఇక్కడున్న ఆర్థిక సమస్యలు దీనికి ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొంది. 2017తో పోలిస్తే 92శాతం మంది కొత్తగా తీవ్రవాద బృందాల్లో చేరారని వివరించింది. చాలామంది ఆఫ్రికన్ల జీవన శైలిపై కొవిడ్‌-19 ప్రభావం చూపిందని, అక్కడ అధిక ద్రవ్యోల్బణం ఏర్పడిందని వివరించింది. అదే సమయంలో మత ప్రాతిపదికన తీవ్రవాదం వైపు మళ్లేవారు 57శాతం తగ్గారని తెలిపింది. బుర్కినాఫాసో, కామెరూన్‌, చాద్‌, మాలి, నైగర్‌, నైజీరియా, సోమాలియా, సూడాన్‌ దేశాల్లో 2,200 మంది తీవ్రవాదుల అభిప్రాయాలను సేకరించామని పేర్కొంది. తీవ్రవాద గ్రూపుల్లో అంతకుముందే సభ్యులుగా ఉన్న వేయి మంది కూడా ఇందులో ఉన్నారని తెలిపింది. 2017 నుంచి కనీసం 4,155 దాడులు నమోదయ్యాయని యూఎన్‌డీపీ నివేదిక వెల్లడించింది. ఈ దాడుల్లో 18,417 మంది మరణించారని, సోమాలియాలో ఎక్కువ దారుణాలు నమోదయ్యాయని పేర్కొంది. సోమాలియాలోని అల్‌షబాబ్‌, నైజీరియాలోని బోకోహరామ్‌ తదితర ఉగ్రవాద బృందాలను ఈ నివేదిక ప్రస్తావించింది. కొందరు ఉగ్రవాదులు అల్‌ఖైదాకు విధేయత చూపుతున్నారని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు