Video games: వీడియో గేమ్స్తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు
మీ పిల్లలు విపరీతంగా వీడియో గేమ్స్ ఆడుతున్నారా. మరేం పర్వాలేదు. వీడియో గేమ్స్ ఆడటం వల్ల బాలల గ్రహణ శక్తి తగ్గడం, విజ్ఞాన సముపార్జన దెబ్బతినడం లేదా మెరుగుపడటం లాంటివి జరగవని అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు.
హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడి
వాషింగ్టన్: మీ పిల్లలు విపరీతంగా వీడియో గేమ్స్ ఆడుతున్నారా. మరేం పర్వాలేదు. వీడియో గేమ్స్ ఆడటం వల్ల బాలల గ్రహణ శక్తి తగ్గడం, విజ్ఞాన సముపార్జన దెబ్బతినడం లేదా మెరుగుపడటం లాంటివి జరగవని అమెరికాలోని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. కొందరిలో ఈ గేమ్స్ గ్రహణ శక్తిని మెరుగుపరిచినా.. యవ్వన వయసు వారిపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలిపారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న 160మంది యవ్వన వయసు వారికి భాషా, గణిత సామర్థ్యాలు అంచనా వేసే కాగ్ ఏటీ పరీక్ష జరిపారు. ఈ బాలలు రోజుకు సగటున రెండున్నర గంటలసేపు వీడియో గేమ్స్ ఆడతామని చెప్పారు. కొంతమంది నాలుగున్నర గంటలు అని చెప్పారు. అయినా వారి గ్రహణ శక్తి, సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నాయి. అదే పనిగా వీడియో గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో అటు గ్రహణ శక్తి మెరుగుపడటం గానీ, సామర్థ్యాలు తగ్గడం గానీ ఉండదని అధ్యయనం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని