Turkey Earthquake: శిథిలాల మధ్య హాహాకారాలు
తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు హృదయాలను మెలిపెడుతున్నాయి.
తుర్కియే, సిరియాల్లో తాండవిస్తున్న విషాదం
తుర్కియే, సిరియాల్లో 11,600 దాటిన భూకంప మృతులు
సహాయక చర్యల్లో 60 వేల మంది సిబ్బంది
8 వేల మందిని రక్షించిన సహాయ బృందాలు
రాళ్లు, రప్పల మధ్య కొనఊపిరితో పలువురు బాధితులు
అంకారా: తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సహాయ శిబిరాలను సందర్శించారు.
భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య 11 వేలను దాటింది. గత దశాబ్ద కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒక్క తుర్కియేలోనే 9వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించగా.. సిరియాలో మొత్తంగా 2,600 మంది ప్రకృతి ప్రకోపానికి బలైపోయారు. మొత్తంగా ఇప్పటివరకు 11,600 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 20వేలు దాటే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు, తుర్కియేలో 37,011 మంది, సిరియాలో 2300 మంది క్షతగాత్రులయ్యారు. వేల సంఖ్యలో కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగించే కొలదీ మృతదేహాలు బయటపడుతున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుని.. ప్రాణాల కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్న సహాయక బృందాలు వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. బెసిని నగరంలో 13 ఏళ్ల బాలిక, ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులతో ప్రాణాలతో రక్షించారు. ఇక్కడ మొత్తం 9మందిని కాపాడారు. కహ్రామన్మారస్ నగరంలో కుప్పకూలిన అపార్ట్మెంట్ భవన శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. అదియమాన్ నగరంలో 10 ఏళ్ల బాలికను కాపాడారు.
* దాదాపు 20కి పైగా దేశాల నుంచి వెళ్లిన సహాయక బృందాలు తుర్కియే అత్యవసర బృందాలతో కలిసి సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత జోన్లో ప్రస్తుతం దాదాపు 60వేల మందికి పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.
* మాలత్య నగరంలో పెద్ద ఎత్తున భౌతికకాయాలను ఒకదాని పక్కన ఒకటి పేర్చి.. దుప్పట్లతో కప్పారని మాజీ పాత్రికేయుడు ఓజెల్ పికల్ వెల్లడించారు. వీరిలో కొందరు మైనస్ ఆరు డిగ్రీల చలికి గడ్డకట్టుకుపోయి మరణించి ఉంటారని పేర్కొన్నారు.
* సిరియాలో కుప్పకూలిన భవన శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారో ఇప్పటికీ తెలియరాలేదు.
కోటి ముప్పై లక్షల మందిపై ప్రభావం
ఈ ఘోర విపత్తుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మరింత సహాయం అందించాలంటూ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ అధికారులను ఆదేశించారు. భూకంప బాధితుల సహాయ శిబిరాలను ఏర్పాటు చేసిన కహ్రామన్మారస్లోని ‘టెంట్ సిటీ’ని బుధవారం ఆయన సందర్శించి అక్కడి వారికి ధైర్యం చెప్పారు. ఈ భూకంపం తీవ్రతకు దేశంలోని 8.5 కోట్ల మంది జనాభాలో 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారని వెల్లడించారు. ఈ భూ విలయం తీవ్రత అధికంగా ఉన్న 10 ప్రావిన్స్ల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 8వేల మందికి పైగా పౌరుల్ని శిథిలాల నుంచి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చినట్టు ప్రకటించారు. 3.8 లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలు/వసతి గృహాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
గల్లంతైన భారతీయుడు
దిల్లీ: తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల్లో 10 మంది చిక్కుకుపోగా వారందరూ సురక్షితంగా ఉన్నారని.. ఓ వ్యక్తి జాడ మాత్రం తెలియడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘వ్యాపార పనిమీద తుర్కియేకు వెళ్లిన ఓ బెంగళూరు వ్యక్తి ఆచూకీ లభించడం లేదు ’ అని భారత విదేశాంగ శాఖ(పశ్చిమ) కార్యదర్శి సంజయ్ వర్మ పేర్కొన్నారు.
* ఆపరేషన్ దోస్త్ పేరుతో తుర్కియేకు ఇప్పటికే 101 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, శిథిలాలను తొలగించే పరికరాలు, వాహనాలు, డాగ్ స్క్వాడ్లను పంపించినట్లు విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. బుధవారం మరో 51 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన మూడో బృందం తుర్కియేకు బయలుదేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.