అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించం
తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని, తమ నుంచి ప్రతిఘటన తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను హెచ్చరించారు.
చైనాకు బైడెన్ హెచ్చరిక
వాషింగ్టన్: తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని, తమ నుంచి ప్రతిఘటన తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను హెచ్చరించారు. చైనా పంపిన అనుమానాస్పద బెలూన్ ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెంచిన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. అమెరికా, ప్రపంచ పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే అంశాల్లో చైనాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తప్పులు ఏమైనా జరిగితే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోమని బెలూన్ పేల్చివేత అంశాన్ని ఉద్దేశిస్తూ హెచ్చరించారు. చైనాతో పోటీ పడతాం కానీ ఘర్షణ పడాలనుకోవట్లేదని తాను ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్కు గతంలో స్పష్టం చేసినట్లు బైడెన్ సభకు తెలిపారు. సైనిక శక్తి సహా అన్ని రకాలుగానూ అమెరికా దృఢంగా ఉందని, చైనాతోనే కాకుండా ఎవరితో అయినా పోటీ పడగలమని తేల్చిచెప్పారు. మొత్తం తన 73 నిమిషాల ప్రసంగంలో బైడెన్ కనీసం ఏడు సార్లు చైనా పేరును ప్రస్తావించారు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ప్రస్తావిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ప్రపంచానికే పెద్ద పరీక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉక్రెయిన్కు అమెరికా అన్ని రకాలుగా సాయపడుతోందని, అది కొనసాగుతుందని వెల్లడించారు.
మెరుగుపడిన దేశ ఆర్థికస్థితి
రెండేళ్ల క్రితం దెబ్బతిన్న అమెరికా ఆర్థికస్థితి మెరుగుపడిందని బైడెన్ తెలిపారు. మాజీ అధ్యక్షులు నాలుగేళ్లలో కల్పించిన ఉద్యోగాలను తాను ఈ రెండేళ్లలోనే సృష్టించానని బైడెన్ గుర్తుచేశారు. అక్రమ, చట్టబద్ధంగా వచ్చిన వలసదారులకు శాశ్వత పౌరసత్వాన్ని కల్పించే సమగ్ర వలసవిధాన సంస్కరణ చట్టాన్ని త్వరగా ఆమోదించాలని ఆయన సభకు విజ్ఞప్తి చేశారు.
పోటీ పడటానికి భయం లేదు: చైనా
బైడెన్ ప్రసంగంపై చైనా స్పందించింది. అమెరికాతో పోటీపడటానికి తాము భయపడటం లేదు కానీ.. ఇరుదేశాల సంబంధాలను కేవలం ఆ కోణం నుంచే చూడటం అభ్యంతరకరమని వ్యాఖ్యానించింది. పోటీ పేరు చెప్పి ఒక దేశం అభివృద్ధి చెందే హక్కును కాలరాయలేరని స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ గాడిన పడేలా తమతో కలిసి పనిచేయాలని అమెరికాకు చైనా సూచించింది. బెలూన్ కూల్చివేసిన అనంతరం చైనా, అమెరికా రక్షణశాఖ మంత్రుల టెలిఫోన్ సంభాషణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా తోసిపుచ్చిందని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. శనివారం బెలూన్ను పేల్చేసిన అనంతరం ఈ ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు