Earthquake: 101 గంటల తర్వాత మృత్యుంజయులుగా.. మూత్రం తాగి ప్రాణం నిలబెట్టుకున్న యువకుడు
ఒకటి కాదు.. రెండు కాదు.. 101 గంటల పాటు వారంతా ఓ భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేకపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారు.
పలువురిని ప్రాణాలతో రక్షించిన బలగాలు
22 వేలు దాటిన తుర్కియే, సిరియా భూకంప మృతులు
అంకారా: ఒకటి కాదు.. రెండు కాదు.. 101 గంటల పాటు వారంతా ఓ భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేకపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17 ఏళ్ల యువకుడు దాహార్తికి తాళలేక తన మూత్రాన్నే తాగాడు!! చలిగాలులు వణికిస్తున్నా, ఎటూ కదిలేందుకు వీల్లేకపోయినా మృత్యువుతో పోరాటంలో వీరంతా విజయం సాధించారు. తుర్కియేలో సహాయక చర్యలు చేపడుతున్న బలగాలు గాజియాంతెప్లో ఈ మృత్యుంజయులను శుక్రవారం సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి. ప్రాణాలతో ఉండేందుకు నాలుగు రోజులకు పైగా వారు పడిన ఆరాటం గురించి తెలిశాక అక్కడివారి కళ్లు చెమర్చాయి. ఈ ప్రాంతం భూకంప కేంద్రానికి చేరువగా ఉంది. సురక్షితంగా బయటపడినవారిలో ఆరుగురు బంధువులు కూడా ఉన్నారు. మూత్రం సేవించాల్సి వచ్చిన అవసరాన్ని కోర్కుట్ చెబుతూ తన కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్న తల్లిని, కుటుంబీకుల్ని హత్తుకున్నాడు. నాలుగు రోజులుగా రెప్పవాల్చకుండా నిరీక్షిస్తున్న కుటుంబాలు కాస్త ఊరడిల్లాయి. ప్రాణాలతో బయటపడినవారిని ఆసుపత్రులకు తరలించారు.
105 గంటలు పోరాడి గెలిచిన చిన్నారి
అదియామన్ అనేచోట నాలుగేళ్ల చిన్నారి 105 గంటలపాటు శిథిలాల కింద చిక్కుకుపోయి మొత్తానికి ప్రాణాలతో బయటపడింది. ఆ చిన్నారిని తల్లివద్దకు చేర్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇస్కెందెరన్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిపోగా అక్కడి శిథిలాల్లో 9 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఆరుగురిని రక్షించారు. కిరిఖాన్లో 50 గంటల తర్వాత ఓ మహిళను జర్మనీ బృందాలు రక్షించాయి. ఇంకోచోట ఇద్దరు కౌమారప్రాయ అక్కాచెల్లెళ్లు ఇలాగే ప్రాణాలతో బయటపడ్డారు. గరిష్ఠంగా వారం రోజుల పాటు ఇలా బతికే అవకాశాలు ఉంటాయనీ, సమయం గడుస్తున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతాయని నిపుణులు చెబుతుండడంతో సహాయక బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. నాసిరకం భవన నిర్మాణ తీరు గురించి ఏళ్ల తరబడి ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం కూడా ప్రాణనష్టం పెరగడానికి కారణమని చెబుతున్నారు. భూకంపం కంటే ఇలాంటి భవనాలే భారీ ప్రాణనష్టాన్ని కలిగించాయని ఆవేదన చెందుతున్నారు.
బతికించిన వాట్సప్
శిథిలాల కింద చిక్కుకున్న ఓ 20 ఏళ్ల విద్యార్థిని వాట్సప్ కాపాడింది. తూర్పు తుర్కియేలోని ఓ అపార్ట్మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న ఆ విద్యార్థి.. సమయస్ఫూర్తితో ఆలోచించి తన స్నేహితులకు వాట్సప్లో వీడియో సందేశం పంపాడు. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నదీ చెప్పాడు. అతడి స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఆ విద్యార్థిని కాపాడారు. బంధువులు మాత్రం ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు ఆ విద్యార్థి తెలిపాడు.
ప్రభావిత ప్రాంతాల్లో సిరియా అధ్యక్షుడి పర్యటన
భూకంపం బారినపడ్డ ప్రాంతాల్లో సిరియా అధ్యక్షుడు బషార్ అసద్ తొలిసారిగా పర్యటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.
కిక్కిరిసిపోతున్న శ్మశానాలు.. వీధుల్లోనే మృతదేహాలు
ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 22,000 దాటింది. ఇది కచ్చితంగా ఇంకా పెరిగే అవకాశమే ఉందని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. జపాన్లోని ఫుకుషిమాలో చోటు చేసుకున్న భూకంపం, సునామీల కంటే ఎక్కువ ప్రాణనష్టమిది. ఒక్క తుర్కియేలోనే 19,300 మంది చనిపోయారని, 77,000 మంది గాయపడ్డారని అధికార వర్గాలు ప్రకటించాయి. సిరియాలో 3,300 మంది చనిపోవడంతో మొత్తం ప్రాణనష్టం 22 వేలు దాటింది. ఈ భూకంపం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు అని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అభివర్ణించారు. ప్రాణనష్టం భారీగా ఉండడంతో శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. దుప్పట్లు, రగ్గుల్లో చుట్టిన మృతదేహాలు వీధుల్లో కనిపిస్తున్నాయి.
ఆ పాప పేరు అయా
తుర్కియేలో శిథిల భవనం కింద బొడ్డు ఊడకుండా ఉన్న పసికందును సహాయక బృందాలు రక్షించిన విషయం తెలిసిందే. ఆమెకు జన్మనిచ్చిన తల్లి సహా కుటుంబమంతా చనిపోవడంతో పాపాయికి చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడి భార్య ఆ శిశువుకు పాలు పట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యులే ఆమెకు ‘అయా’ అని పేరు పెట్టారు. అంటే ‘అద్భుతం’ అని అర్థం. ఆ పాపను దత్తత తీసుకునేందుకు వందల మంది ముందుకు వస్తున్నారు.
బాసటగా నిలుస్తాం: మోదీ
దిల్లీ: ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా తుర్కియేలో భారత బలగాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. క్లిష్ట సమయంలో తుర్కియేకు అన్ని విధాలా బాసటగా నిలుస్తామని ట్వీట్ చేశారు. తుర్కియేలో భారత సైన్యం నెలకొల్పిన ఆసుపత్రిలో వంద మందికి పైగా చికిత్స పొందారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఆరేళ్ల మరో పాపను రక్షించాయి. ఇంతవరకు 13 మృతదేహాలను వెలికితీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.