ఎయిర్ఫోర్స్ వన్ వదిలేసి.. 10 గంటలు రైల్లో ప్రయాణించి..
యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి వెళ్లొచ్చిన తీరు ఆద్యంతం రహస్యమే. శ్వేతసౌధం నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు బయటకు రావడం నుంచి పోలండ్ మీదుగా ఉక్రెయిన్కు వెళ్లడం, తిరిగి రావడం గురించి తెలిసింది అతి కొద్దిమందికే.
బైడెన్ ఉక్రెయిన్ పర్యటన ఆద్యంతం రహస్యం
సి-32 విమానంలో ప్రయాణం
వాషింగ్టన్: యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి వెళ్లొచ్చిన తీరు ఆద్యంతం రహస్యమే. శ్వేతసౌధం నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు బయటకు రావడం నుంచి పోలండ్ మీదుగా ఉక్రెయిన్కు వెళ్లడం, తిరిగి రావడం గురించి తెలిసింది అతి కొద్దిమందికే. అమెరికా బలగాలే లేని యుద్ధక్షేత్రానికి అధ్యక్షుడు వెళ్లడం ఆధునిక చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఒకరిద్దరు అధ్యక్షులు వేరే దేశాల్లో ఇలాంటి ప్రాంతాలకు వెళ్లినా అక్కడ ఆ సమయంలో అగ్రరాజ్యం బలగాలు ఉండేవి. అమెరికా అధ్యక్షుడి హోదాలో 2006లో జార్జ్ బుష్ బాగ్దాద్లో పర్యటించారు. 2014లో బరాక్ ఒబామా అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో ప్రత్యక్షమయ్యారు. 2019లో డొనాల్డ్ ట్రంప్ అఫ్గానిస్థాన్లో బాగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులతో కలిసి సంబరాలు చేసుకొన్నారు.
చివరి క్షణంలో రష్యాకు సమాచారం
ఉక్రెయిన్కు సంఘీభావం ప్రకటించడానికి బైడెన్ వెళ్లి 23 గంటల్లో తిరిగి స్వదేశానికి చేరుకోవడం కొంత ప్రమాదంతో కూడుకున్న పర్యటనగానే చెబుతున్నారు. ఆయన పర్యటనలో ఉన్న సమయంలో దాడులు జరగకుండా ఉండేందుకు, అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణకు తావు లేకుండా చూసేందుకు రష్యాకు కొద్ది గంటల ముందు సమాచారం ఇచ్చారు. వారాంతపు పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7 గంటల సమయంలో భార్యాసమేతంగా వెళ్లిన బైడెన్ ఆ తర్వాత 36 గంటలపాటు బయట ప్రపంచానికి కనిపించలేదు. ఎప్పుడూ ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి బదులు సి-32లో ఉక్రెయిన్కు బయల్దేరిన విషయం ఒకరోజు తర్వాత ధ్రువపడింది. దీనిలో అతి తక్కువమంది భద్రత సిబ్బంది, అధికారులు, వైద్యులు ఉన్నారు. సాధారణంగా ఈ తరహా విమానాలను అమెరికా పరిధిలో చిన్నచిన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే వాడుతుంటారు. అధ్యక్షుడు ఎక్కడకు వెళ్లినా ఆ విశేషాలను ప్రపంచానికి అందించడానికి 13 మంది పాత్రికేయుల్ని తీసుకువెళ్తారు. ఉక్రెయిన్ పర్యటనలో ఇద్దరే ఉన్నారు. వారివద్ద నుంచి కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రతాధికారులు ముందుగానే స్వాధీనపరచుకుని స్విచాఫ్ చేశారు.
లోహ విహంగం కిటికీల మూసివేత
ఇంధనం కోసం ఈ విమానం తొలుత జర్మనీలోని రామ్స్టెయిన్లో అమెరికా సైనిక స్థావరానికి చేరుకొంది. అక్కడ విమానం కిటికీలను పూర్తిగా మూసి ఉంచారు. అక్కడి నుంచి పోలండ్లోని జెసియోనాక్ విమానాశ్రయంలో గంట తర్వాత ఈ లోహ విహంగం దిగింది. ఆ ప్రయాణంలో విమానం ట్రాన్స్పాండర్ను కూడా ఆఫ్లో ఉంచారు. ఆ తర్వాత రైలులో 10 గంటలు ప్రయాణించి బైడెన్ కీవ్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ నగరంలో పర్యటనకూ లిమోసీన్ కారుకు బదులు తెల్లరంగు ఎస్యూవీని వాడారు. ఉక్రెయిన్ తరఫున పోరాటంలో అసువులుబాసిన సైనికులకు నివాళులు అర్పించేందుకు బైడెన్ వెళ్తున్న చిత్రం బయటకు వచ్చాక ఆయన పర్యటన గురించి ప్రపంచానికి తెలిసింది. బైడెన్ అక్కడున్న సమయంలో అమెరికా విమానాలు కీవ్ గగనతలంపై నిఘా ఉంచాయి.
మాకు చెప్పారు.. మేం హామీ ఇవ్వలేదు
బైడెన్ ఆకస్మిక పర్యటన గురించి దౌత్యమార్గాల ద్వారా తమకు సమాచారం పంపించారనీ, ఆయన భద్రతకు ఎలాంటి హామీని తామివ్వలేదని రష్యా ‘ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్’ డైరెక్టర్ అలెగ్జాండర్ బొర్ట్నికోవ్ మంగళవారం స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు