Heart Attack: తియ్యటి ఎరిథ్రిటాల్తో గుండెపోటు ముప్పు
ఆహార పదార్థాల్లో తియ్యదనం రావడానికి వాడే కృత్రిమ పదార్థమైన ఎరిథ్రిటాల్ వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువవుతుందని తాజా పరిశోధనల్లో తేలింది.
క్లీవ్లాండ్ క్లినిక్ పరిశోధనల్లో వెల్లడి
వాషింగ్టన్: ఆహార పదార్థాల్లో తియ్యదనం రావడానికి వాడే కృత్రిమ పదార్థమైన ఎరిథ్రిటాల్ వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువవుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇలాంటి ఉత్పత్తులను దీర్ఘకాలం వాడటం వల్ల వచ్చే ప్రమాదాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. రక్తంలో ఎరిథ్రిటాల్ స్థాయి ఎక్కువగా ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా, ఐరోపాలలో 4వేల మందిపై క్లీవ్లాండ్ క్లినిక్ పరిశోధకులు చేసి పరీక్షల్లో గుర్తించారు. మొత్తం రక్తంలో లేదా ప్లేట్లెట్లు, రక్త కణాలలో విడివిడిగా దీన్ని గమనించినప్పుడు కూడా అది రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతోందని తెలిపారు. నేచర్ మెడిసిన్ పత్రికలో ఈ పరిశోధన వ్యాసం ప్రచురితమైంది.
ఎరిథ్రిటాల్ వల్ల ప్లేట్లెట్లు సులభంగా క్రియాశీలకమై.. గడ్డలు ఏర్పడుతున్నట్లు పరీక్షల్లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల ఆహార పదార్థాలు, పానీయాల్లో ఎరిథ్రిటాల్ను ఉపయోగిస్తారు. దీనిపై ఐరోపా ఆహార భద్రతా సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలూ మరింతగా పరిశోధనలు చేయనున్నాయి. కృత్రిమ తీపి పదార్థాలు వాడటం వల్ల గుండె కవాటాల వ్యాధి వచ్చే ముప్పు ఉంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ గత సంవత్సరం సెప్టెంబరులో చేసిన పెద్ద స్థాయి పరిశోధనల్లోనూ తేల్చిచెప్పింది. గుండె కవాటాల వ్యాధులు క్రమంగా పెరుగుతాయని, గుండెవ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాలు ఎక్కువవుతున్నాయని క్లీవ్లాండ్ క్లినిక్లో ప్రివెంటివ్ కార్డియాలజీ విభాగాధిపతి స్టాన్లీ హాజెన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది