ఉగ్రవాద జాబితాను రాజకీయం చేయొద్దు
ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణిని భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల ‘క్వాడ్’ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది.
పరోక్షంగా చైనాపై క్వాడ్ ధ్వజం
తీవ్రవాదంపై ప్రత్యేక బృందం ఏర్పాటుకు నిర్ణయం
సమావేశంపై డ్రాగన్ గరంగరం
దిల్లీ: ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణిని భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల ‘క్వాడ్’ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది. డ్రాగన్ పేరు ప్రస్తావించకుండా తీవ్రవాదంపై ఆ దేశం అనుసరిస్తున్న తీరును పరోక్షంగా ఎండగట్టింది. శుక్రవారం భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ నేతృత్వంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రులు ఆంటోనీ బ్లింకెన్, యోషిమాసా హయాషి, పెన్నీ వాంగ్ సమావేశమయ్యారు. అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఈ సారి క్వాడ్ ఎజెండాలో ఉగ్రవాదం కూడా చేరింది. జైశంకర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని క్వాడ్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ‘‘ఉగ్ర జాబితాను రాజకీయం చేయొద్దన్నది సమావేశ నిర్ణయాల్లో ఒకటి’’ అని తెలిపారు. ఇది ఒక రకంగా నేరుగా చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యే. గతంలో నిబంధన 1267 అల్ఖైదా ఆంక్షల కమిటీ కింద భారత్ ప్రతిపాదించిన ఉగ్రవాదుల జాబితాను చైనా సాంకేతిక కారణాలు చూపుతూ పదే పదే అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్లో దాడులకు కుట్రపన్ని పాక్ తీవ్రవాదులకు మద్దతిస్తూ వచ్చింది. వారికి వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాలు ఉన్నా.. చైనా వీటో చేయడంతో చాలా సార్లు భారత్కు చుక్కెదురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉగ్ర జాబితాను రాజకీయం చేయొద్దన్న నిర్ణయం క్వాడ్ తీసుకోవడం గమనార్హం. భారత్ అధ్యక్షతన జరిగిన క్వాడ్ విదేశాంగమంత్రుల సమావేశంపై చైనా మండిపడింది. శాంతి, అభివృద్ధి తదితర అంశాల్లో ఒక దేశం ఇంకో దేశంతో మాట్లాడుకోవాలని, ఇలా కూటములు కట్టడం సరికాదని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే