శ్రీలంక, పాక్లకు చైనా అండ.. ఐఎంఎఫ్ రుణాల విషయంలో సహకారం
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం సేకరించడానికి పాకిస్థాన్, శ్రీలంకలకు చైనా తోడ్పడుతోంది. ఐఎంఎఫ్ నుంచి రుణం కోరే సంస్థలు మొదట తమ ఆర్థిక పరిస్థితిని ఒక దారికి తెచ్చుకోవాలి.
కొలంబో/ఇస్లామాబాద్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం సేకరించడానికి పాకిస్థాన్, శ్రీలంకలకు చైనా తోడ్పడుతోంది. ఐఎంఎఫ్ నుంచి రుణం కోరే సంస్థలు మొదట తమ ఆర్థిక పరిస్థితిని ఒక దారికి తెచ్చుకోవాలి. ఇతర దేశాలకు, సంస్థలకు తాము చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేసి, స్వదేశంలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవాలి. దీన్ని ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అంటారు. ఐఎంఎఫ్ నుంచి 290 కోట్ల డాలర్ల రుణం కోసం శ్రీలంక, 110 కోట్ల తక్షణ రుణం కోసం పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నాయి. శ్రీలంక చెల్లించాల్సిన రుణాన్ని రెండేళ్లపాటు వాయిదా వేయడానికి చైనా ఇటీవల సుముఖత వ్యక్తం చేసినా, ఐఎంఎఫ్ తృప్తిపడలేదు. దీంతో చైనా తాజాగా మరింత గడువు ఇచ్చి ఐఎంఎఫ్ రుణం పొందడానికి శ్రీలంకకు వీలు కల్పించింది. ఇతర దేశాలు, ఆర్థిక సంస్థలకు తాను చెల్లించాల్సిన రుణాల గడువు పెంచుకుంటే శ్రీలంకకు నాలుగేళ్ల కాలానికి 290 కోట్ల డాలర్ల రుణమిస్తానని ఐఎంఎఫ్ ప్రతిపాదించింది.
చైనా రుణానికి వాయిదా కోరిన పాక్
మరోవైపు చైనాకు ఈ నెలాఖరుకల్లా తాము చెల్లించాల్సిన 200 కోట్ల డాలర్ల రుణాన్ని ఇంకో ఏడాదిపాటు వాయిదా వేయాల్సిందిగా కోరినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ఐఎంఎఫ్కు తెలిపింది. చైనా నుంచి సేఫ్ డిపాజిట్ పథకం కింద పాక్ సేకరించిన 400 కోట్ల రుణాల్లో మిగిలిన భాగాన్ని రానున్న నెలల్లో తీర్చాల్సి ఉంది. ఐఎంఎఫ్ నుంచి 110 కోట్ల డాలర్ల రుణాన్ని సేకరించడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అడుగంటిపోయిన విదేశీమారక ద్రవ్య నిల్వలను భర్తీ చేసుకోవడానికి పాకిస్థాన్ మిత్రదేశాల నుంచి, బహుళ పక్ష సంస్థలు, వాణిజ్య బ్యాంకుల నుంచి జూన్ నెలాఖరుకల్లా 1,000 కోట్ల డాలర్ల నిధులను సేకరించాలని లక్షిస్తోంది. అందులో 700 కోట్ల డాలర్ల రుణాన్ని ఐఎంఎఫ్ నుంచి పొందడానికి ప్రయత్నిస్తున్న పాక్, తక్షణం 110 కోట్ల డాలర్లను విడుదల చేయాలని కోరుతోంది. అందుకు ఐఎంఎఫ్ పెట్టిన షరతుల మేరకు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం గత నెలలో చైనా నుంచి 70 కోట్ల డాలర్లను స్వీకరించింది. త్వరలో 130 కోట్ల డాలర్ల రుణాన్ని పొందబోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్