Elon Musk: మాజీ ఉద్యోగి అంగవైకల్యాన్ని ఎగతాళి చేసిన మస్క్
ట్విటర్ నుంచి తొలగించిన మాజీ ఉద్యోగిని ఎగతాళి చేస్తూ అతడి వైకల్యం గురించి ట్వీట్లు చేసిన సంస్థ అధిపతి ఎలాన్ మస్క్... ఆనక తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరారు.
తప్పు సరిదిద్దుకొని క్షమాపణ
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ నుంచి తొలగించిన మాజీ ఉద్యోగిని ఎగతాళి చేస్తూ అతడి వైకల్యం గురించి ట్వీట్లు చేసిన సంస్థ అధిపతి ఎలాన్ మస్క్...ఆనక తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఐస్లాండ్కు చెందిన హరాల్డుర్ థొర్లెఫ్సన్ (హల్లి) అనే ట్విటర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. 9 రోజులు ఎదురుచూసి చివరకు మస్క్ను ట్యాగ్ చేస్తూ సోమవారం ట్వీట్ చేశారు. దీనికి ‘మీరు ట్విటర్లో ఏం పని చేస్తున్నారు. ఏ విభాగంలో పని చేశారు’ అని మస్క్ వరుస ప్రశ్నలు సంధించగా.. హల్లి దానికి సమాధానాలిచ్చారు. మీరు ఏమంత గొప్పగా పని చేయలేదని మస్క్ స్పందించారు. ట్విటర్లో ఈ సంభాషణ జరుగుతుండగానే హల్లికి ట్విటర్ నుంచి తన లేఆఫ్ ఈ-మెయిల్ వచ్చింది. మస్క్ అక్కడితో ఆగకుండా హల్లికి ఉన్న వైకల్యం గురించి వ్యాఖ్యానిస్తూ.. అతడికి ఉన్న సమస్యను సాకుగా చూపిస్తున్నారని ట్వీట్ చేశారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న హల్లి నిలబడలేరు. చక్రాల కుర్చీలోనే ఉంటూ తన పని చేయాల్సి ఉంటుంది. దీనిని వివరిస్తూ ఆ మాజీ ఉద్యోగి తన వ్యాధి గురించి, దానితో పోరాడుతున్న విధానం గురించి వరుస ట్వీట్లు చేశారు. దీంతో అతడి వైకల్యం గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన మస్క్ను చట్టప్రకారం శిక్షించాలని యూజర్లు ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మంగళవారం సాయంత్రానికి తన తప్పును గుర్తించిన మస్క్.. హల్లిని క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు. ‘అతడికి వీడియో కాల్ చేసి మాట్లాడా. ఇలాంటి విషయాల్లో ట్విటర్ కన్నా వీడియో కాల్స్నే ఆశ్రయించడం మంచిది’ అని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!