జనాభా పెంచేందుకు చైనా అవస్థలు
చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జననాలను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది.
వధువులకిచ్చే ‘కైలీ’ కట్టడికి చర్యలు
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జననాలను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెళ్లి సమయంలో వధువుకు పెళ్లి కుమారుడు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. చైనాలో వరుడు తన సంపదను వధువువద్ద ప్రదర్శించడానికి, ఆమెను పెంచినందుకు అత్తింటి వారికి సొమ్ములు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. దీనిని ‘కైలీ’ అంటారు. చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇందుకోసం వరుడి కుటుంబాల్లో వార్షికాదాయానికి దాదాపు కొన్ని రెట్ల మొత్తం వధువు కుటుంబికులకు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో జననాల రేటు పతనాన్ని అడ్డుకునేందుకు చైనా అధికారులు ఈ సంప్రదాయంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే దేశంలో చాలా తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకుని సంతానాన్ని కంటున్నారు. ఈ పరిస్థితికి ‘కైలీ’ కారణమని భావిస్తున్నారు. జనవరిలో సెంట్రల్ హుబే ప్రావిన్స్లో అధికారులు కైలీ విధానం అమలు చేసేవారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు జింగ్సి నగరంలో కైలీ అడగబోమని యువతుల చేత సంతకాలు చేయించారు. ఉమెన్స్ డే సందర్భంగా జింగ్షూ ప్రావిన్స్ రాజధానిలో సామూహిక వివాహాలను ఏర్పాటు చేశారు. చైనాలో వన్ఛైల్డ్ పాలసీని అమలు చేసిన సమయంలో కైలీ విధానం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి.. స్త్రీల సంఖ్య తగ్గింది. దీంతో వధువు కుటుంబికులు భారీ స్థాయిలో సొమ్మును ఆశించడం మొదలుపెట్టారు. తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా ప్రకటించింది.
ఇంటర్నెట్ కేబుళ్లను చైనా ధ్వంసం చేసింది: తైవాన్
నవ్గన్ (తైవాన్): తైవాన్ను ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న చైనా తాజాగా మరో చర్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. తమ దేశానికి చెందిన ఓ ద్వీపమైన మట్సు ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందకుండా కేబుళ్లను ఆ దేశం ధ్వంసం చేసిందని పేర్కొంది. చైనాకు సమీపంలోని మట్సులో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఆ ద్వీపంలో నివసిస్తున్నవారు విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, వైద్యుల అపాయింట్మెంట్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. మట్సుకు చెందిన 14,000 మంది రెండు సబ్మెరైన్ ఇంటర్నెట్ కేబుళ్ల ఆధారంగా సేవలు పొందుతారు. రెండు చైనా నౌకలు వీటిని ధ్వంసం చేశాయని తైవాన్ నేషనల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎన్సీసీ) ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు