Indonesia: శరవేగంగా ఇండోనేసియా కొత్త రాజధాని నిర్మాణం
ఇండోనేసియా రాజధాని ఏదంటే టక్కున చెప్పే సమాధానం జకార్తా. అయితే, మరికొద్ది నెలల్లో ఆ దేశ రాజధాని చిరునామా మారిపోనుంది.
వచ్చే ఏడాది ఆగస్టుకు అధ్యక్ష భవనం సిద్ధం
అదే సమయంలో ‘నుసంతర’ పాక్షిక ప్రారంభం
2045 నాటికి కర్బన తటస్థ, హరిత నగరంగా ముస్తాబు
ఏటేటా భూమిలోకి కుంగిపోతున్న జకార్తా
పర్యావరణ మార్పులతో పెనుప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత రాజధాని జకార్తా స్థానంలో కొత్త రాజధానిని నిర్మించుకునే మహత్తరమైన క్రతువులో ఇండోనేసియా నిమగ్నమైంది. పచ్చని అటవీ ప్రాంతంలో రమణీయమైన, అత్యాధునికమైన నయా రాజధానిని ఆ దేశం తీర్చిదిద్దుతోంది. జాతీయ అధికారిక చిహ్నం గరుడను స్ఫురించేలా అధ్యక్ష భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు ప్రారంభానికల్లా ఈ సువిశాలమైన భవనం పూర్తిస్థాయిలో ఆకృతిదాల్చనుంది. ప్రస్తుతం దీనితో పాటు వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం చురుగ్గా కొనసాగుతోంది. ఇండోనేసియా కొత్త రాజధాని నుసంతరపై ‘ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం..
ఇండోనేసియా రాజధాని ఏదంటే టక్కున చెప్పే సమాధానం జకార్తా. అయితే, మరికొద్ది నెలల్లో ఆ దేశ రాజధాని చిరునామా మారిపోనుంది. జకార్తాకు రెండు వేల కిలోమీటర్ల దూరంలో పచ్చని అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘నుసంతర’కు తరలిపోనుంది. సుందర బోర్నియో ద్వీపంలోని విశాల అటవీ ప్రాంతంలో నూతన రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి? కొత్త నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఇండోనేసియా అనేక దీవుల సమాహారం. ఎక్కువ భాగం అటవీ ప్రాంతం కావడం వల్ల నేలపై జనాభా ఒత్తిడి ఉంటుంది. జావా ద్వీపంలోని రాజధాని జకార్తా ఇప్పటికే కోటి మందికి పైగా జనాభాతో కిక్కిరిసింది. గ్రేటర్ మెట్రో పాలిటన్ ప్రాంతంలోని జనాభా ఇంతకు మూడు రెట్లు అధికంగా ఉంటుంది. మరో పక్క జావా సముద్ర తీరంలోని ఆ నగరం ఏటేటా కొన్ని సెంటీమీటర్ల మేర భూమిలోకి కుంగిపోతోంది. వివిధ నివేదికల ప్రకారం 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేయటం, వాతావరణ మార్పులు వంటివి ఇందుకు కారణాలు. భూకంప ముప్పూ పొంచి ఉంది. ఇతరత్రా అనేక సమస్యలు చుట్టుముట్టిన జకార్తా నుంచి రాజధానిని మార్చాలని ఇండోనేసియా ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిర్ణయించింది.
కొత్త రాజధాని ఎలా ఉంటుంది?
బోర్నియో ద్వీపంలోని తూర్పున గల కాలిమాంటన్ అటవీ ప్రాంతంలో నుసంతర పేరిట కొత్త నగర నిర్మాణాన్ని ఇండోనేసియా ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించింది. నుసంతర అంటే ద్వీప సమూహం అని అర్థం. ప్రస్తుత రాజధాని జకార్తాకు 2 వేల కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రణాళిక ప్రకారం.. నుసంతరలో ప్రభుత్వ భవనాలు, ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి నిర్మాణ స్థలం వద్ద అది ఎప్పటికి పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందీ వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. త్రీడీ విజువల్స్లో చూసేందుకు క్యూఆర్ కోడ్ సంకేతాలను అందుబాటులో ఉంచారు. కొత్త నగరానికి ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్ వర్తింపజేస్తున్నామని ‘నుసంతర జాతీయ రాజధాని ప్రాధికార సంస్థ’ అధికారి బాంబాంగ్ తెలిపారు. నగరమంతా పచ్చని వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉంటుందని, భవనాల చుట్టూ, పైన, రహదారుల వెంట మొక్కలు, చెట్లు పెంచుతామని, ఉద్యానవనాలు, అత్యాధునిక నీటి వ్యవస్థలు, సౌరవిద్యుత్ తదితర కాలుష్యరహిత విధానాలకు అత్యంత ప్రాధాన్యముంటుందని వివరించారు. కర్బన తటస్థతను సాధించేలా వ్యర్థాల నిర్వహణకు ‘స్మార్ట్’ వ్యవస్థలు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఏడువేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇండోనేసియా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఆగస్టు 17న ఈ నగరాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అప్పటికి గరుడ ఆకృతిలో నిర్మిస్తున్న అధ్యక్ష భవనం సిద్ధమవుతుంది. కొత్త రాజధాని నిర్మాణ పనులన్నీ 2045 నాటి పూర్తవుతాయని వెల్లడించారు. అదే సంవత్సరం ఇండోనేసియా 100వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటుంది.
పర్యావరణవేత్తల ఆందోళన
కొత్త రాజధాని నిర్మాణంపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు కొందరు ఆందోళన చెందుతున్నారు. జాతీయ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి సంస్థ గణాంకాల ప్రకారం రాజధాని ప్రాజెక్ట్ కోసం 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. దీంతో ఆ అటవీ ప్రాంతంలో ఒరాంగుటాన్, సన్బేర్స్ వంటి అరుదైన వన్య ప్రాణుల మనుగడకు ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. గిరిజన జాతులు తమ స్వస్థలాలను వీడేందుకు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే కొత్త రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నందున ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాల ప్రజలను తరలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
లైంగిక నేరారోపణల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్(72)కు ఓ కేసులో ఊరట లభించింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM