చైనా కలిపిన ఉప్పు-నిప్పు
అలుగుటయే ఎరగని అజాతశత్రువు అలిగితే ఎంత ఆశ్చర్యమో... కలలోనూ కలవటం అసాధ్యమనుకునే ఆగర్భ శత్రువుల్లాంటివారు మాట్లాడుకుంటే అంతకంటే ఆశ్చర్యం! అలాంటి సంభ్రమాశ్చర్య సంఘటనే శుక్రవారం బీజింగ్లో సంభవించింది.
ఇరాన్, సౌదీ మధ్య దౌత్య ఒప్పందం
మధ్య ఆసియా రాజకీయాల్లో భారీ మార్పు
అమెరికా ఆధిపత్యానికి దెబ్బా?
అలుగుటయే ఎరగని అజాతశత్రువు అలిగితే ఎంత ఆశ్చర్యమో... కలలోనూ కలవటం అసాధ్యమనుకునే ఆగర్భ శత్రువుల్లాంటివారు మాట్లాడుకుంటే అంతకంటే ఆశ్చర్యం! అలాంటి సంభ్రమాశ్చర్య సంఘటనే శుక్రవారం బీజింగ్లో సంభవించింది. అదే... ఇరాన్-సౌదీ అరేబియా మధ్య ఒప్పందం! ప్రపంచ ఇస్లామిక్ రాజకీయాల్లో ఉప్పునిప్పులా చిటపటలాడే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య ఎలా కుదిరింది? చైనా ఎందుకు మధ్యవర్తిగా వ్యవహరించింది? ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?
మూడోసారి అధ్యక్షుడిగా షి జిన్పింగ్ అభ్యర్థిత్వానికి చైనా పార్లమెంటు ఆమోదముద్ర వేసిందనే వార్తలకంటే శుక్రవారం బీజింగ్ నుంచి వచ్చిన ఓ వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అదే సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సయోధ్య కుదరటం. చైనా మధ్యవర్తిత్వంలో ఈ రెండు దేశాలూ స్నేహరాగం ఆలపించటం విశేషం. ఈ ఒప్పందం ప్రకారం... సౌదీ, ఇరాన్లు రక్షణ ఒప్పందంతో పాటు బంద్ చేసిన దౌత్య కార్యాలయాలను పరస్పరం పునరుద్ధరించుకుంటాయి. సాంస్కృతిక, వాణిజ్య బంధాలకూ ద్వారాలు తెరుస్తాయి.
ఎందుకు శత్రుత్వం?
రెండూ ఇస్లామిక్ దేశాలే అయినా సౌదీ, ఇరాన్ల మధ్య బంధం ఉప్పునిప్పులా చిటపటలాడుతూనే ఉంది. కారణం ఇరాన్ షియా ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... సౌదీ సున్నీలకు! అలా రెండు దేశాల మధ్య వర్గ విభేదాలు కొనసాగుతూ మధ్య ఆసియాలో రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఫలితంగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్లలో తలెత్తిన యుద్ధాలు, ఘర్షణల్లో ఇరాన్, సౌదీలు పరోక్షంగా శత్రువులుగా మారాయి.
మరి ఇప్పుడీ ఒప్పందం ఎలా?
పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇరాన్, సౌదీల మధ్య ఇప్పుడు ఉన్నట్లుండి ఎలా ఒప్పందం కుదిరిందన్నది చూస్తే... సౌదీలో మహమ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతర్గత రాజకీయాలతోపాటు దౌత్యనీతిలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పటిదాకా చమురుపై అధికంగా ఆధారపడ్డ తమ దేశాన్ని... మునుముందు అన్నిరంగాల్లోనూ ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని రాజు భావిస్తున్నారు. ఇందుకోసం విజన్-2030 పేరిట ఓ ప్రణాళిక రూపొందించారు. దీర్ఘకాలిక ఘర్షణలు, శత్రుత్వాలపట్ల కాసింత మెతకవైఖరి అవలంబించటం అందులో భాగంగా చెబుతున్నారు. అదే ఇరాన్తో దౌత్య ఒప్పందానికి దారి తీసింది. మరోవైపు ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అమెరికా భారీ ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా స్వదేశంలో ఉద్యమాలూ సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ లక్ష్యాలను సాధించటానికి మధ్య ఆసియాలో విభేదాలకంటే స్నేహాలను పెంచుకోవాలని ఇరాన్ చూస్తోంది. తాజా ఒప్పందానికి ఆ ధోరణి బాటలు వేసింది.
ఘర్షణ తొలగినట్లేనా?
ఇరాన్, సౌదీ దౌత్య ఒప్పందం కుదిరినా షియా, సున్నీల మధ్య ఘర్షణవాతావరణంలో అది పెద్దగా మార్పు తెచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు భావిస్తున్నారు. పైగా... యెమెన్, సిరియాల్లో ఈ రెండు దేశాలూ పరస్పర వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి తోడు... మధ్య ఆసియాలో అనేక సాయుధబలగాలకు ఇరాన్ సాయం చేస్తోంది. ఇది ఈ ప్రాంతంలో రాజకీయంగా ఇబ్బందులు సృష్టించటంతోపాటు, తమ సార్వభౌమత్వానికి ప్రమాదంగా సౌదీ భావిస్తోంది. అంతేగాకుండా అమెరికాకు సౌదీ అరేబియా సన్నిహిత దేశం. సౌదీలో అమెరికా సైనిక శిబిరాలున్నాయి. మరోవైపు ఇరాన్కు అమెరికాకు అస్సలు పడదు. ఆ దేశంపై అమెరికా బలమైన ఆంక్షలు విధించింది. ఈ అడ్డంకుల నేపథ్యంలో ఒప్పందం ఎంతమేరకు మనస్ఫూర్తిగా అనుబంధంగా మారుతుందన్నది సందేహమేనని నిపుణుల అంచనా!
అమెరికాను కాదని చైనా...
ఈ ఒప్పందం రెండు దేశాలకే పరిమితం కాదని.. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో మార్పులకు సంకేతమనే వాదనా వినిపిస్తోంది. పెద్దన్న పాత్ర పోషించటానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా దీని ద్వారా సంకేతాలు పంపుతోందని భావిస్తున్నారు. ఒకరకంగా ఈ ఒప్పందం అమెరికాకు ఇబ్బందికర పరిణామం. మధ్య ఆసియా రాజకీయాల్లో అమెరికా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో తమ భాగస్వామ్య దేశం (సౌదీ) శత్రుదేశమైన ఇరాన్తో.. అదీ చైనా మధ్యవర్తిగా ఒప్పందం కుదుర్చుకోవటం అమెరికాకు కొరుకుడుపడని వ్యవహారం. మునుముందు మధ్య ఆసియాలో అమెరికా పాత్రను పరిమితం చేయటానికే కాకుండా... ఉక్రెయిన్-రష్యా యుద్ధంలోనూ శాంతిదూతగా వ్యవహరించేందుకు సిద్ధమని చైనా సంకేతాలు పంపిస్తోందన్నది విశ్లేషకుల భావన.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?