ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల దాడులు
ఉక్రెయిన్పై రష్యా దాడుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 16 డ్రోన్లతో పుతిన్ సేన విరుచుకుపడింది.
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 16 డ్రోన్లతో పుతిన్ సేన విరుచుకుపడింది. వీటిలో 11 లోహవిహంగాలను నేలకూల్చామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. రాజధాని కీవ్, పశ్చిమ లివివ్ ప్రావిన్స్ సహా మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపింది. కీవ్ వైపు వచ్చిన డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేసినట్లు నగరపాలక వ్యవస్థ అధిపతి సెర్హిల్ పోప్కో చెప్పారు. మూడు డ్రోన్లు పోలండ్ సరిహద్దుల్లోని ఒక జిల్లాను తాకాయి. మొత్తంమీద గడిచిన 24 గంటల్లో రష్యా దళాలు 34 వైమానిక దాడులు, ఒక క్షిపణి దాడి, విమాన విధ్వంసక వ్యవస్థలతో 57 రౌండ్ల కాల్పులు జరిపినట్లు శనివారం ఉదయం ఉక్రెయిన్ వాయుసేన ప్రకటించింది. దక్షిణ ఖేర్సన్ ప్రావిన్స్లో నింగి నుంచి పడ్డ శకలాల వల్ల ఏడు ఇళ్లు, ఒక ప్రాథమిక పాఠశాల దెబ్బతిన్నాయి. దొనెట్స్క్ ప్రావిన్స్లో జరిగిన శతఘ్ని గుళ్ల దాడుల్లో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. 11 పట్టణాలు, గ్రామాలపై ఈ ప్రభావం కనిపించింది. జపోరిజియా నగరంలో రష్యా రాకెట్లు ఒక నివాస ప్రాంతంపై పడ్డాయి. ఫలితంగా కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.
క్రిమియాను సందర్శించిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం క్రిమియాను సందర్శించారు. రష్యాలో ఈ ప్రాంతం విలీనమై 9 ఏళ్లయిన సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఒక బాలల కేంద్రాన్ని సందర్శించారు. ఉక్రెయిన్ నుంచి పిల్లల తరలింపునకు ఆయనే బాధ్యుడంటూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేసిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. భద్రతా కారణాలరీత్యా క్రిమియాను తమ ఆధీనంలో ఉంచుకోవడం అనివార్యమని పుతిన్ పేర్కొన్నారు.
ధాన్యం ఒప్పందాన్ని పొడిగించిన రష్యా, ఉక్రెయిన్
ఉక్రెయిన్ నుంచి ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియాకు ఆహారధాన్యాల ఎగుమతికి వీలు కల్పించే ఒప్పందాన్ని పొడిగించాలని రష్యా, ఉక్రెయిన్ నిర్ణయించాయి. యుద్ధ సమయంలో చేపట్టిన ఈ చర్య వల్ల పేదలకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆహార ధాన్యాల ధరలు పెరగడం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఒప్పందం పొడిగింపు నిర్ణయాన్ని తుర్కియే అధ్యక్షుడు ఎర్దోగాన్.. ఐరాసలో ప్రకటించారు. 120 రోజుల పాటు ఈ పొడిగింపును ఇచ్చినట్లు ఉక్రెయిన్ ఉపప్రధాని ఒలెక్సాండర్ కుబ్రాకోవ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!