ఇమ్రాన్ పార్టీపై నిషేధం?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన లాహోర్ ఇంటి నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకొన్న నేపథ్యంలో ఆయన సారథ్యంలోని ‘పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీని నిషేధిత సంస్థగా ప్రకటించే అంశాన్ని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
న్యాయ నిపుణులనుసంప్రదిస్తున్నట్లు తెలిపిన మంత్రి
అధినేత సహా పీటీఐ నేతలపై ఉగ్రవాద కేసు నమోదు
ఇస్లామాబాద్, లాహోర్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన లాహోర్ ఇంటి నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకొన్న నేపథ్యంలో ఆయన సారథ్యంలోని ‘పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీని నిషేధిత సంస్థగా ప్రకటించే అంశాన్ని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు మీడియాకు తెలిపారు. శనివారం ఇస్లామాబాద్ జిల్లా కోర్టుకు ఇమ్రాన్ హాజరైన సందర్భంగా ఆయన అనుచరులు సృష్టించిన విధ్వంసం, పోలీసులతో ఘర్షణకు దిగడంపై పాలకపక్ష నేతలు మండిపడుతున్నారు. కోర్టు లోపలికి వెళ్లకుండా వాహనంలో కూర్చొనే హాజరు సంతకం పెట్టడంపైనా వీరు విస్తుపోతున్నారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇమ్రాన్ఖాన్తోపాటు దాదాపు 12 మంది పీటీఐ నేతలపై ఇస్లామాబాద్ పోలీసులు ఆదివారం ఉగ్రవాద కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ పార్టీ ఓ ఉగ్రవాద సంస్థ అంటూ పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ వ్యాఖ్యానించగా.. ఈ వాదనను దాదాపుగా సమర్థిస్తున్నట్లే ప్రధాని షెహబాజ్ సైతం ట్వీట్ చేశారు.
నా ఇంటిపై దాడి కోర్టు ధిక్కారమే : ఇమ్రాన్
‘‘సెర్చ్ వారెంట్ లేకుండా భారీసంఖ్యలో పోలీసులు నా ఇంటిపై దాడి చేయడం కోర్టు ధిక్కారమే. రాజకీయాలతో సంబంధం లేని బుష్రా బీబి (భార్య) ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇలా చొరబడటం ఇస్లామిక్ సూత్రాలకు కూడా విరుద్ధమే. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’’ అంటూ ఇమ్రాన్ఖాన్ లాహోర్లోని తన ఇంట్లో పోలీసులు జరిపిన సోదాలపై వరుస ట్వీట్లు చేశారు. కాగా, ఈ తనిఖీల తర్వాత.. ఇమ్రాన్తోపాటు వెయ్యిమంది పీటీఐ కార్యకర్తలపై ఉగ్రవాద అభియోగాలతో కేసులు నమోదు చేస్తున్నట్లు లాహోర్ పోలీసులు ఆదివారం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!