కాలిఫోర్నియా నింగిలో కాంతిచారలు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆకాశాన వింత కాంతి చారలు దర్శనమిచ్చాయి. అవేంటన్నది అర్థంకాని ప్రజలు వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
అంతరిక్ష వ్యర్థం మండిపోవడమే కారణమంటున్న శాస్త్రవేత్తలు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆకాశాన వింత కాంతి చారలు దర్శనమిచ్చాయి. అవేంటన్నది అర్థంకాని ప్రజలు వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. కొద్దిసేపట్లోనే అవి అదృశ్యమయ్యాయని జేమీ హెర్నాండెజ్ అనే వ్యక్తి పేర్కొన్నారు. గతంలో తాను ఇలాంటి పరిమాణాన్ని చూడలేదని పేర్కొన్నారు. అయితే అంతరిక్షం నుంచి వచ్చిపడ్డ శకలాలు భూవాతావరణంలో మండిపోవడం వల్లే ఆ కాంతి చారలు ఏర్పడి ఉంటాయని జోనాథన్ మెక్డోవెల్ అనే ఖగోళశాస్త్రవేత్త పేర్కొన్నారు. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో జపాన్కు చెందిన ఒక కమ్యూనికేషన్ సాధనం ఉండేదన్నారు. అది సమాచారాన్ని తొలుత ఒక ఉపగ్రహానికి, ఆ తర్వాత భూమికి చేరవేసేదని చెప్పారు. దాని బరువు 310 కిలోలని, దాన్ని 2020లో ఐఎస్ఎస్ నుంచి జారవిడిచారని వివరించారు. అది ఇప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించి, మండిపోయి ఉంటుందని తెలిపారు. ఆ పరిణామం కాంతిచారల్లా కనిపించాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా