పసిమొగ్గలపై వాయు కాలుష్యం
అడ్డూఅదుపూ లేని మానవచర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన గాలి అనేది మృగ్యమైపోతోంది.
పొగచూరుతున్న ఊపిరితిత్తులు
అడ్డూఅదుపూ లేని మానవచర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన గాలి అనేది మృగ్యమైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రధానంగా పిల్లలకు ఇది శరాఘాతమవుతోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, వారి భవితను ఛిద్రం చేస్తోంది. వాయు కాలుష్యం తగ్గితే ఆ ప్రాంతంలోని చిన్నారుల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుందని స్వీడన్ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన నిర్ధారణ.. ప్రభుత్వాలకు కర్తవ్యబోధ చేస్తోంది.
ప్రమాద ఘంటికలు..
* చిన్నారుల్లో మెదడు, ఊపిరితిత్తులు సహా అనేక కీలక భాగాలు ఎదుగుదల దశలో ఉంటాయి. వాయు కాలుష్యం ఎక్కువైతే వారి మెదడు, నాడీ వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది. విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గొచ్చు.
* ఉబ్బసం ముప్పు పెరుగుతుంది. చిన్నతనంలో వచ్చే క్యాన్సర్కూ ఆస్కారం ఉంటుంది.
* నవజాత శిశువులకు ఇళ్లలోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువ.
* వాయు కాలుష్యానికి స్వల్పంగా గురైనా.. పిల్లల మానసిక, ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
* కలుషిత గాలికి గర్భిణులు ఎక్కువగా గురైతే.. వారికి నెలలు నిండకుండానే కాన్పు కావొచ్చు. తక్కువ బరువుతో శిశువులు జన్మించడానికీ ఆస్కారం ఉంటుంది.
* ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లలోపు చిన్నారుల్లో 93 శాతం మంది (180 కోట్ల మంది).. ఆరోగ్యం, ఎదుగుదలను ప్రమాదంలో పడేసే స్థాయిలో కలుషితమైన గాలిని శ్వాసిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. కలుషిత గాలితో కలిగే దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నట్లు అంచనా.
* బాల్యంలో అధికమోతాదులో వాయు కాలుష్యం బారినపడితే.. పెద్దయ్యాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
ముప్పు అధికం
పెద్దలతో పోలిస్తే పిల్లలు వేగంగా శ్వాసిస్తారు. అందువల్ల వారి ఊపిరితిత్తుల్లోకి అధిక మోతాదులో కాలుష్యకారకాలు ప్రవేశిస్తాయి.
* తక్కువ ఎత్తు వల్ల పిల్లలు నేలకు దగ్గరగా ఉంటారు. పెద్దలతో పోలిస్తే.. వాతావరణంలో చాలా దిగువ ప్రాంతం నుంచి వారు గాలిని పీల్చుకుంటారు. అక్కడ కొన్నిరకాల కాలుష్యకారకాల తీవ్రత ఎక్కువ.
ఇలా చేయాలి..
* డబ్ల్యూహెచ్వో నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి.
* శిలాజ ఇంధనాల వాటాను తగ్గించాలి. ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెట్టాలి. పునర్వినియోగ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి. దీనివల్ల వాటిని కాల్చడం కూడా తగ్గుతుంది.
* రద్దీగా ఉండే రోడ్లు, కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వంటివి వాయు కాలుష్యానికి ప్రధాన వనరులు. పాఠశాలలు, క్రీడా మైదానాలను వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే పిల్లలను ఈ విషతుల్య వాయువుల బారి నుంచి రక్షించొచ్చు.
గాలి మారింది.. ఊపిరితిత్తులు మెరుగుపడ్డాయి..
గత 20 ఏళ్లలో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో వాయు కాలుష్య కారకాలు బాగా తగ్గినట్లు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల అక్కడ వాయు నాణ్యత మెరుగుపడినట్లు తేల్చారు. ఈ కాలంలో పిల్లల ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎలా ఉందన్నది వారు పరిశీలించారు.
* పరిశోధనలో భాగంగా బామ్సీ ప్రాజెక్టు కింద సేకరించిన డేటాను విశ్లేషించారు. ఆ ప్రాజెక్టు కింద.. 1994 నుంచి 1996 మధ్య జన్మించిన 4వేల మందిని పరిశీలించారు. 8, 16, 24 ఏళ్ల వయసులో స్పైరోమెట్రిక్ పరీక్షను నిర్వహించి, వీరి ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించారు.
* పరీక్షార్థులు జన్మించినప్పటి నుంచి పెద్దయ్యేవరకూ నివసించిన ప్రాంతాల్లో గాల్లోని కాలుష్యకారకాలను విశ్లేషించారు. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే హానికర రేణువుల స్థాయిని కొలిచారు.
* 2002-04తో పోలిస్తే 2016-19లో స్టాక్హోమ్లో వాయు కాలుష్యం 40 శాతం తగ్గిందని గుర్తించారు. కొన్నిచోట్ల ఈ క్షీణత 60 శాతం ఉంది. మిగతాచోట్ల వాయు నాణ్యతలో పెద్దగా వైరుధ్యంలేదు.
* వాయు నాణ్యత బాగున్న ప్రాంతాల్లోని యువతలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడినట్లు గుర్తించారు. కాలుష్యం తాకిడిని స్వల్పస్థాయిలో తగ్గించుకోగలిగినా.. చిన్నతనం నుంచి యువ్వనంలోకి అడుగుపెట్టేవరకూ ఊపిరితిత్తుల పనితీరు, ఎదుగుదలలో మెరుగుదల కనిపిస్తుందని తేలింది.
* ఇది చాలా ముఖ్యమైన పరిశీలన. చిన్నప్పటి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బట్టే భవిష్యత్లో దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఆధారపడి ఉంటుంది. ఇలాంటివారికి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ముప్పు 20 శాతం తక్కువని వెల్లడైంది.
కలుషిత గాలి.. కోట్ల మంది చిన్నారులను విషతుల్యం చేస్తోంది. వారి జీవితాలను నాశనం చేస్తోంది. ఇది క్షమించరాని నేరం. ప్రతి చిన్నారి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. తద్వారా వారు ఆరోగ్యంగా ఎదిగి, తమ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తారు.
డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసస్
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు