ఇమ్రాన్ పార్టీ ఆదేశాలను అధ్యక్షుడు పాటిస్తున్నారు
ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి నడుచుకుంటున్నారని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు.
ఆరిఫ్ అల్విపై పాక్ ప్రధాని షెహబాజ్ ఆరోపణలు
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి నడుచుకుంటున్నారని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. దేశాధ్యక్షుడిగా తటస్థంగా ఉండకుండా, ఇమ్రాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తల నిరసనలను అణచివేసే క్రమంలో అసాధారణ రీతిలో పోలీసులను ప్రయోగించిన విషయాన్ని తప్పుపడుతూ ఆరిఫ్ షెహబాజ్కు లేఖ రాశారు. దీనిపై షెహబాజ్ ఘాటుగా స్పందించారు. ఆరిఫ్ అధ్యక్షుడు కాకముందు పీటీఐలో కొనసాగారు.
పాక్ను గట్టెక్కించేందుకు ఇమ్రాన్ పది అంశాల ప్రణాళిక
ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్ను కాపాడేందుకు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 10 అంశాల ప్రణాళికను ప్రకటించారు. లాహోర్లో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. విదేశాల్లో ఉన్న పాకిస్థానీలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు అందిస్తామని, దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగి, రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్)ను అభ్యర్థించాల్సిన అవసరం తప్పుతుందని ఇమ్రాన్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్