అగ్రదేశాల మధ్య అణు తూటాల రగడ
ఉక్రెయిన్కు డిప్లీటెడ్ యురేనియంతో చేసిన తూటాలను సరఫరా చేస్తామన్న బ్రిటన్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ నిప్పులు చెరిగారు.
వాషింగ్టన్: ఉక్రెయిన్కు డిప్లీటెడ్ యురేనియంతో చేసిన తూటాలను సరఫరా చేస్తామన్న బ్రిటన్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్కు అణు పరికరాలను అందిస్తున్నారని ఆరోపించారు. బ్రిటన్ గనుక వీటిని ఉక్రెయిన్కు అందిస్తే తమదైన శైలిలో స్పందిస్తానని హెచ్చరించారు. యురేనియం అని పేరున్నంత మాత్రాన అవి అణ్వస్త్రాలు కావని బ్రిటన్ స్పష్టం చేస్తోంది. అవి పూర్తిగా సంప్రదాయ ఆయుధాలేనని వాదిస్తోంది.
ఏమిటీ డిప్లీటెడ్ యురేనియం..?
అణు ఇంధనం, ఆయుధాల తయారీకి ఉపయోగించే శుద్ధ యురేనియం తయారీలో ఉప ఉత్పత్తిగా డిప్లీటెడ్ యురేనియం (డీయూ) వస్తుంది. ఇది శుద్ధ యురేనియం కన్నా చాలా తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అణుబాంబులో జరిగే ‘విచ్ఛిత్తి ప్రక్రియ’ను ఇది కలిగించలేదు. ఈ పదార్థం చాలా మందంగా, సీసం కన్నా దృఢంగా ఉంటుంది. ఈ లక్షణాల దృష్ట్యా దీన్ని శతఘ్ని, ట్యాంకు గుళ్ల తయారీలో వాడుతున్నారు. అవి ఆధునిక యుద్ధ ట్యాంకులకు అమర్చే దుర్భేద్య కవచాలనూ ఛిద్రం చేసుకొని లోపలికి దూసుకెళ్లగలవు. ఈ క్రమంలో అమితంగా వేడెక్కుతాయి. ఈ ఉష్ణం ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ఆ ట్యాంకులు వెంటనే మంటల్లో చిక్కుకుపోతాయి. అసాధారణ వేగంతో ప్రయోగించినప్పుడు డీయూ తూటాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి.
1970ల నుంచి అమెరికా డీయూతో కవచ ఛేదక తూటాలను తయారు చేయడం మొదలుపెట్టింది. ట్యాంక్ కవచాల తయారీలోనూ వాడుతోంది. ట్యాంక్ కిల్లర్గా పిలిచే ఏ-10 విమానాలూ ఈ తూటాలనే ప్రయోగిస్తున్నాయి.
బాంబు కాదు కానీ..
డీయూతో తయారుచేసే ఆయుధాలను అణ్వస్త్రాలుగా పరిగణించరు. వీటి నుంచి వెలువడే రేడియోధార్మికత చాలా తక్కువ. డీయూ ప్రధానంగా ఆల్ఫా రేణువులను వెలువరిస్తుంది. చర్మం గుండా చొచ్చుకెళ్లే అంత శక్తి వాటికి ఉండదు. అందువల్ల డీయూ.. చర్మానికి తగిలినా పెద్ద ప్రమాదంగా పరిగణించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కాలిన గాయాలు, తీవ్ర రేడియోధార్మిక ప్రభావం వంటివి చాలా అరుదని పేర్కొన్నారు. అయితే ఈ పదార్థంలో రసాయన విషతుల్యత ఎక్కువ. అందువల్ల దాని విషయంలో జాగ్రత్తలు అవసరమని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) హెచ్చరిస్తోంది. రేడియోధార్మిక ముప్పుగా కన్నా విషతుల్య రసాయనంగా దీన్ని ఎక్కువగా ఈ సంస్థ పరిగణిస్తోంది. ఆ పదార్థాన్ని నోరు లేదా శ్వాస ద్వారా తీసుకోవడం హానికరమని తెలిపింది.
* శరీరంలోకి ప్రవేశించే డీయూ రేణువులు చాలావరకూ విసర్జితాల ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కొన్ని మాత్రం రక్తంలో కలిసే అవకాశం ఉంది. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతినవచ్చు.
* డీయూ తూటాలను గ్లౌజుల ధరించి మాత్రమే తాకాలని నిపుణులు చెబుతున్నారు.
* ఒక ప్రాంతంలో వాడిన డీయూ తూటాల సంఖ్యను బట్టి అక్కడ ముప్పు తీవ్రత ఉంటుందన్నారు. ఒకవేళ భారీగా వినియోగిస్తే సంబంధిత ప్రాంతంలో నేల, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీటి నుంచి వచ్చే స్వల్పస్థాయి రేడియోధార్మికత కూడా ఆరోగ్య సమస్యలను కలిగించొచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏయే దేశాల వద్ద?
డీయూ ఆయుధాలను అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా, పాకిస్థాన్లు తయారు చేశాయి. మరో 14 దేశాల వద్ద కూడా అటువంటి ఆయుధ నిల్వలు ఉన్నాయి.
విపరీతంగా వాడిన అమెరికా
డీయూ షెల్స్ను 1991, 2003లో జరిగిన గల్ఫ్ యుద్ధాల్లో, కొసావోలో ఉపయోగించారు. వీటివల్ల ఆయా ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఇరాక్పై అమెరికా సాగించిన యుద్ధంలో దాదాపు 10 వేల రౌండ్ల డీయూ తూటాలు వాడినట్లు కథనాలు వచ్చాయి. జనావాసాల వద్ద కూడా వీటిని ప్రయోగించినట్లు తెలిపాయి. ఇరాక్లోని 300 ప్రదేశాల్లో డీయూ తూటాల అవశేషాలను గుర్తించారు. వీటిని శుభ్రం చేయడానికి అప్పట్లోనే కనీసం 30 మిలియన్ డాలర్లు అవుతుందని అంచనావేశారు. డీయూ ఆయుధాల్లో చాలావరకూ అమెరికా ప్రయోగించగా.. మిగిలినవి సంకీర్ణ సేనలు వాడినట్లు భావిస్తున్నారు. ఇరాక్ యుద్ధంలో అమెరికా 300 టన్నుల డీయూ వాడినట్లు రష్యా అధికారులు ఆరోపించారు. దీనివల్ల ఇరాక్లోని ఫలూజా నగరంలో హిరోషిమా, నాగసాకీని మించిన స్థాయిలో రేడియేషన్ ఉందని పేర్కొన్నారు. ఈ నగరం రెండో చెర్నోబిల్గా మారిందన్నారు. 2018లో అల్ అరేబియా పత్రిక కథనం ప్రకారం ఇరాక్లో వైకల్యంతో పుట్టేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. మరోవైపు తాము ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు డీయూ ఆయుధాలే కారణమా అని అమెరికాలో పలువురు మాజీ సైనికులు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఇరాక్, కొసావోలో క్యాన్సర్ కేసులు బాగా పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు