పాక్ రాజకీయాల్లో ఇమ్రాన్ అయినా ఉండాలి.. మేమైనా ఉండాలి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి సనావుల్లా సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ రాజకీయాలను శత్రుత్వంగా మార్చారని, ఆయనైనా లేదా తామైనా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తుందని హెచ్చరించారు. శనివారం ఓ ప్రైవేటు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పీఎంఎల్-ఎన్’కు ఇమ్రాన్ శత్రువుగా మారారు. మేం ఆయన్ను అలాగే పరిగణిస్తాం. మా పార్టీ ఉనికి ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడుకోవడానికి పీటీఐకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగిస్తాం. ఇమ్రాన్ అయినా రాజకీయాల్లో కనుమరుగు కావాలి. లేదా మేమైనా రాజకీయాలకు దూరం కావాలి. పీటీఐ, పీఎంఎల్-ఎన్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండే స్థితికి ఇమ్రాన్ దేశ రాజకీయాలను దిగజార్చారు’’ అని సనావుల్లా పేర్కొన్నారు. ఇమ్రాన్ రెండు పార్టీల కార్యకర్తల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనివల్ల పీటీఐ కార్యకర్తలు మమ్మల్ని చంపడమో, లేదా మా కార్యకర్తలు ఆయన్ను చంపడమో జరిగే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై పీటీఐ పార్టీ స్పందించింది. ‘‘ప్రభుత్వం నుంచి ఇమ్రాన్కు ప్రాణాపాయం ఉంది. పీఎంఎల్-ఎన్ నేతలు నేరుగా హత్య బెదిరింపులకు దిగారు’’అని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సనావుల్లా వ్యాఖ్యలపై జోక్యం చేసుకోవాలని ఇమ్రాన్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
7 కేసుల్లో ఇమ్రాన్కు మధ్యంతర బెయిలు
ఇమ్రాన్ ఖాన్పై నమోదైన 143 కేసుల్లో ఏడింటిలో సోమవారం మధ్యంతర బెయిలు లభించింది. ఈ నెల 18న అవినీతి కేసులో విచారణ కోసం ఇమ్రాన్ ఇస్లామాబాద్ జిల్లా కోర్టుకు వచ్చినప్పుడు పీటీఐ కార్యకర్తలు పెద్దఎత్తున గుమికూడి భద్రతాదళాలపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్తోపాటు ఆయన కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వీటిపై ఇమ్రాన్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఏడు కేసుల్లో ఉపశమనం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్