ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
యుద్ధం వస్తే క్షణాల్లో క్షిపణులతో దాడి చేసి.. స్పందించేందుకైనా తమ దేశానికి సమయం ఇవ్వబోమన్న అపోహల్లో అమెరికా రాజకీయనాయకులు ఉన్నారని.. వాటిని వీడాలని రష్యా పేర్కొంది.
కీవ్/మాస్కో: యుద్ధం వస్తే క్షణాల్లో క్షిపణులతో దాడి చేసి.. స్పందించేందుకైనా తమ దేశానికి సమయం ఇవ్వబోమన్న అపోహల్లో అమెరికా రాజకీయనాయకులు ఉన్నారని.. వాటిని వీడాలని రష్యా పేర్కొంది. తమ దేశ ఉనికికే ప్రమాదం వస్తే.. అమెరికా సహా ఎలాంటి శక్తినైనా ధ్వంసం చేసే అత్యాధునిక ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొంది. ‘‘రష్యా ఓపిగ్గా ఉంది. సైనికశక్తితో ఇతరులను కవ్వించాలని అనుకోవడం లేదు. అయితే ఉనికికే ముప్పు ఎదురైతే అమెరికా సహా ఎలాంటి వ్యతిరేక శక్తులనైనా ధ్వంసం చేయగల సత్తా మాకు ఉంది’’ అని ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి నికొలోయ్ పత్రుషేవ్ హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సోమవారం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) అధిపతి రఫెల్ గ్రాసీ కలిశారు. ఈ సందర్భంగా జపొరీజియా అణువిద్యుత్కేంద్రంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితిపై అధ్యక్షుడికి గ్రాసీ వివరించారు. ప్లాంటులో పరిస్థితి మెరుగుపడటం లేదని, ఆ ప్రాంతమంతా సైన్యం ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల విద్యుత్కేంద్రానికి పలుమార్లు కలిగిన విద్యుత్తు అంతరాయాలను, డీజిల్ జనరేటర్లపై ఆధారపడాల్సి రావడాన్ని ప్రస్తావించారు. ఈ వారంలో ప్లాంటును రఫెల్ గ్రాసీ దర్శించనున్నారు.
* తూర్పు ఉక్రెయిన్లో స్లొవియాన్స్క్లో రష్యా దాడుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారని, 29 మంది గాయపడ్డారని ఆ నగర గవర్నర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె